దుబాయ్ : ఐపీఎల్ 2021 రెండో దశ పోటీలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 20 న కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తో జరుగనున్న మ్యాచ్లో రెడ్ జెర్సీకి బదులుగా బ్లూ జెర్సీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) (RCB) జట్టు ధరించనున్నది. ఈ విషయాన్ని ఆర్సీబీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
కోహ్లీ నాయకత్వంలో రెండో ఫేజ్ ఐపీఎల్ మ్యాచులు ఆడేందుకు సిద్ధమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారి నీలిరంగు జెర్సీలో దర్శనమివ్వనున్నది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎంతో విలువైన సేవలను అందించిన ఫ్రంట్లైన్ వారియర్స్కు మద్దతును ప్రకటిస్తూ ఈ నీలి రంగు జెర్సీని ధరిస్తున్నట్లు ఆర్సీబీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ‘కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహిస్తున్న ఫ్రంట్లైన్ వారియర్స్ అమూల్యమైన సేవలకు నివాళి అర్పించేందుకు.. ఫ్రంట్లైన్ యోధులు ధరించే పీపీఈ కిట్ల రంగును పోలివుండే బ్లూ జెర్సీని ధరించడం ఆర్సీబీ సభ్యులుగా మాకు గర్వకారణం’ అని ట్విట్టర్లో పేర్కొన్నది. ఐపీఎల్ ఫేజ్-1 సమయంలో కూడా మే 3 న కేకేఆర్తో జరిగే మ్యాచ్లో బ్లూ జెర్సీలో కనిపించబోతున్నట్లు ఆర్సీబీ జట్టు ప్రకటించింది. కొవిడ్ కారణంగా టోర్నమెంట్ నిలిపివేయడంతో.. అప్పటి మాటను ఇప్పుడు నిలబెట్టుకుంటున్నది. కరోనాతో ఇబ్బందిపడుతున్న బెంగుళూరు, ఇతర నగరాలకు 100 వెంటిలేటర్లు, 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను విరాళంగా ఇస్తామని అప్పట్లో ఆర్సీబీ జట్టు ప్రకటించింది.
‘ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నది. గత వారం ఈ విషయం గురించి చర్చించాం. ఈ క్లిష్ట సమయంలో గ్రౌండ్ లెవల్లోని ఫ్రంట్లైన్ కార్మికులకు ఎలా సహాయపడవచ్చనే దానిపై చర్చించి వారికి మద్దతుగా నిలిచేందుకు బ్లూ జెర్సీని ధరించాలని నిర్ణయించాం’ అని ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పారు.
అధికార భాషగా హిందీకి 72 ఏండ్లు
బర్రెపై ఎక్కి వచ్చి నామినేషన్ దాఖలు.. ఎక్కడంటే..?
యాంటీఆక్సిడెంట్ మందుతో గుండెపోటు నివారించొచ్చు
ఆర్థిక రాజధాని టు దేశ రాజధాని.. లక్ష కోట్లతో ఎక్స్ప్రెస్వే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..