న్యూఢిల్లీ : దేశ ఆర్థిక రాజధాని నుంచి దేశ రాజధానికి దూరం తగ్గించాలన్న సంకల్పంతో కొత్త ఎక్స్ప్రెస్వే (Expressway) నిర్మాణానికి కేంద్రం సన్నద్ధమైంది. దాదాపు 1350 కిలోమీటర్ల దూరం గల ఈ ఎక్స్ప్రెస్వేను లక్ష కోట్ల బడ్జెట్తో పూర్తిచేయనున్నారు. ఐదు రాష్ట్రాల మీదుగా సాగే ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే.. ముంబై-న్యూఢిల్లీ మధ్య దూరం 350 కిలోమీటర్ల మేర తగ్గనున్నది. కరోనా కారణంగా పనులు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, ఈ ప్రాజెక్టును 2023 జనవరి కల్లా పూర్తిచేయాలని నిర్ణయించారు.
ముంబై-న్యూఢిల్లీ మధ్య ఎక్స్ప్రెస్వే పనులు ప్రారంభమయ్యాయి. తొలుత 6 లేన్ల రోడ్డు నిర్మాణం చేపట్టానున్నారు. అనంతరకాలంలో మరో 4 లేన్ల పనులను చేపడతారు. ఈ నాలుగు లేన్లు ఎలక్ట్రిక్ వాహనాలను నడిపేందుకు మాత్రమే కేటాయించనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక నాలుగు లేన్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ముంబై నుంచి న్యూఢిల్లీకి కేవలం 13 గంటల్లోనే చేరుకోవచ్చు. ఇప్పుడు ఇదే దూరాన్ని పూర్తిచేయడానికి దాదాపు 25 గంటల సమయం పడుతున్నది. ఈ ఎక్స్ప్రెస్వే వెంబడి కాలుష్యాన్ని నివారించేలా ఇండస్ట్రియల్ టౌన్షిప్, స్మార్ట్ సిటీస్ కూడా నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసింది. ఈ రోడ్డు మొత్తమ్మీద 92 ప్రాంతాలను ఇంటర్వెల్ స్టాప్స్గా తయారుచేయనున్నారు.
ఈ ఎక్స్ప్రెస్వే నిర్మాణం పూర్తయితే.. ఏడాదికి 32 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అవుతుంది. ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు రోడ్డుకు ఇరువైపులా 1.5 మీటర్ల ఎత్తులో గోడ ఏర్పాటు చేస్తారు. హైవేలపై కాకుండా స్లిప్ లేన్లలో టోల్ ప్లాజాలు నిర్మిస్తారు. పశువులు రోడ్డు దాటేందుకు వీలుగా ప్రతి 2.5 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఓవర్ పాస్లను నిర్మిస్తారు. అలాగే, ప్రతి 500 మీటర్లకు ఒకటి చొప్పున అండర్ పాస్లు కూడా ఏర్పాటుచేయనున్నారు. రోడ్డుకు ఇరువైపులా 15 లక్షల మొక్కలు నాటి పెంచాలని నిర్ణయించారు. అలాగే, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, కన్వియెన్స్ స్టోర్లు, పెట్రోల్ బంకులు, ఈవీ ఛార్జింగ్ పాయింట్లు, టాయిలెట్లను ఏర్పాటుచేస్తున్నారు. సోలార్ పవర్లో వీధి దీపాలను కూడా అమర్చనున్నారు.
పాకిస్తాన్కు తాలిబాన్ షాక్.. మా ఆసక్తులు మాకుంటాయని వెల్లడి
9/11 వంటి పెద్ద దాడి జరుగొచ్చు : అమెరికాకు చైనా హెచ్చరిక
హైదరాబాద్ను వదులుకుంటే కశ్మీర్ ఇస్తామని ప్రతిపాదన.. ఎవరు చేశారంటే..?
టీవీ యాంకర్గా నటుడు సోనూ సూద్.. ఏ ఛానల్లో.. ఏ ప్రోగ్రాంలో..?
1500 మందితో పాట షూటింగ్.. ఒక్కరికీ కరోనా రాలేదు! ఎందుకంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..