హైదరాబాద్ రాష్ట్రాన్ని వదులుకోవాలని, అలాగైతేనే కశ్మీర్ రాష్ట్రాన్ని ఇచ్చేందుకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని సర్దార్ పటేల్ (Sardar Patel) స్పష్టం చేశారు. ఈ విషయంపై అప్పటి రక్షణ మంత్రి బల్దేవ్ సింగ్కు 1947 లో సరిగ్గా ఇదే రోజున లేఖ కూడా రాశాడు. అయితే, పాకిస్తాన్ చేసిన చిన్న తప్పిదానికి ఆగ్రహం వ్యక్తం చేసిన సర్దార్ పటేల్.. కశ్మీర్ రాష్ట్రాన్ని ఇచ్చేది లేనేలేదని గట్టిగా వాదించాడు. ఫలితంగా హైదరాబాద్తోపాటు కశ్మీర్ కూడా మనకే ఉండిపోయాయి.
స్వాతంత్ర్యం సిద్ధించిన తొలి నాళ్లలో భారతదేశం అనేక సమస్యలను ఎదుర్కొన్నది. ప్రధానమైన సమస్యల్లో సంస్థానాల విలీనం ఒకటి. చాలా రాచరిక రాష్ట్రాలు భారతదేశంతో కలిసేందుకు ముందుకొచ్చాయి. అయితే, కొన్ని సంస్థానాలు మాత్రం తామే స్వతంత్ర్య దేశమని ప్రకటించుకున్నాయి. వీటిలో ఒకటి కశ్మీర్. ఇవ్వాల్టికీ ఇండియా-పాకిస్తాన్ మధ్య సమస్యగా కొనసాగుతున్నది.
ఈ సంస్థానాలను భారతదేశంలోకి తీసుకువచ్చే బాధ్యత సర్దార్ పటేల్కు అప్పగించారు. కశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ తన రాచరిక రాష్ట్రం జమ్ముకశ్మీర్ను స్వతంత్రంగా ఉంచాలని నిర్ణయించుకున్నాడు. పాకిస్తాన్లో కశ్మీర్ కలిపితే.. జమ్ములోని హిందువులకు అన్యాయం జరుగుతుందని, అది భారతదేశంలో కలిపితే.. ముస్లింలకు అన్యాయం జరుగుతుందని హరిసింగ్ విశ్వసించాడు.
భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి రెండు నెలల ముందు వరకు లార్డ్ మౌంట్బాటన్ కశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్తో మాట్లాడుతునే ఉన్నారు. పాకిస్తాన్తో వెళ్లాలని నిర్ణయించుకుంటే.. భారతదేశం జోక్యం చేసుకోదు అని మౌంట్బాటన్ స్పష్టం చేశాడు. హైదరాబాద్కు బదులుగా కశ్మీర్ను పాకిస్తాన్కు ఇవ్వడానికి సర్దార్ పటేల్ అంగీకరించారు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ.. కశ్మీర్ కావాలనుకుంటే పాకిస్తాన్లో చేరవచ్చు అని ఆనాటి రక్షణ మంత్రి బల్దేవ్ సింగ్కు పటేల్ ఒక లేఖ రాశారు. అదే రోజున జునాగఢ్ విలీన ప్రతిపాదనను పాకిస్తాన్ అంగీకరించిందని తెలుసుకుని పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో కశ్మీర్ను ఎట్టిపరిస్థితుల్లో పాకిస్తాన్కు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
2013: ఆఫ్ఘనిస్తాన్ హెరాత్ లోని అమెరికా కాన్సులేట్పై తాలిబాన్ తీవ్రవాదులు దాడి
2009: చంద్రుడిపై మంచును కనుగొనడానికి ఇస్రో-నాసా చేసిన లక్ష్యం విఫలం
2008: ఢిల్లీలో మూడు చోట్ల 30 నిమిషాల వ్యవధిలో నాలుగు బాంబు పేలుళ్లు, 19 మంది దుర్మరణం
2007: బృహస్పతి కంటే మూడు రెట్లు పెద్ద గ్రహం కనుగొన్న నాసా శాస్త్రవేత్తలు
2002: పాలస్తీనా ఆక్రమిత గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడి
2000: షెనాండోవాలో జరిగిన మొదటి ఫిడే చెస్ ప్రపంచ కప్ను గెలుచుకున్న భారతదేశానికి చెందిన విశ్వనాథన్ ఆనంద్
1948 : సర్దార్ పటేల్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలోకి చేరిన సైన్యం
1947: 40 లక్షల మంది హిందువులు, ముస్లింలను పరస్పరం బదిలీ చేసుకోవాలని సూచించిన భారత ప్రధాని నెహ్రూ
1929 : జైలులో ఉంటున్న పోరాటయోధుల హక్కుల కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు జతీంద్రనాథ్ దాస్ మరణం
టీవీ యాంకర్గా నటుడు సోనూ సూద్.. ఏ ఛానల్లో.. ఏ ప్రోగ్రాంలో..?
1500 మందితో పాట షూటింగ్.. ఒక్కరికీ కరోనా రాలేదు! ఎందుకంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..