అథెరోస్క్లెరోసిస్ (Atherosclerosis) అనేది ధమనుల గట్టిపడే వ్యాధి. ధమనులు బ్లాక్ కావడంతో రక్త ప్రవాహం నిలిచిపోతుంది. ఫలితంగా గుండెతో పాటు ఇతర అవయవాలకు రక్తం సరఫరా నిలిచిపోతుంది. దీనినే అథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. గుండెపోటు, స్ట్రోక్స్ వంటి పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్కు కారణమవుతుంది. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (ఎల్డీఎల్) కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ చెందినప్పుడు ధమనుల్లో ఫలకాలను ఏర్పడేలా చేస్తుంది. ఇవి ధమనుల గోడలను చీలిపోయేలా చేయడంతోపాటు రక్తం గడ్డకట్టేలా చేస్తుంది. దాంతో గుండెపోటు, స్ట్రోక్ వంటి సీరియస్ సమస్యలు ఉత్పన్నమవుతాయి.
ఈ రకమైన ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఆక్సిడేషన్ చెందకుండా ఉండేందుకు సిస్టమిన్ అనే యాంటీఆక్సిడెంట్ మందు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రొఫెసర్ డేవిడ్ లీక్, అతడి బృందం గుర్తించింది. ఈ మందు తీసుకోవడం వల్ల అథెరోస్క్లెరోసిస్ రివర్స్ అయి, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ రాకుండా నివారిస్తుందని పేర్కొన్నారు. ఈ పరిశోధన జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (జేఏహెచ్ఏ) లో ప్రచురితమైంది.
ఈ గుర్తించిన యాంటీఆక్సిడెంట్ మందు మానవుల్లో ఎంతో సురక్షితమైనదని, ఇది ఇప్పటికే సిస్టినోసిస్ వంటి లైసోసోమల్ వ్యాధుల నివారణకు వాడుతున్నట్లు ఆ పత్రంలో తెలిపారు. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ చెంది ధమని గోడలోని రోగనిరోధక కణాల్లో లైసోసోమ్స్ అనే చిన్నచిన్న యాసిడ్ బ్యాగ్స్ తయారవుతాయని ఇదివరకే యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్ పరిశోధకులు తెలిపారు. ఎలుకల్లో పరిశోధనలు జరుపగా, సిస్టమిన్ డ్రగ్తో 32 నుంచి 56 శాతం వరకు మెరుగైన ఫలితాలు కనిపించాయని వారు పేర్కొన్నారు.
యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్కు చెందిన పరిశోధక బృందానికి ప్రొఫెసర్ డేవిడ్ లీక్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ యాంటీఆక్సిడెంట్ డ్రగ్తో గుండెపోటు, స్ట్రోక్స్ వంటివి నివారించి మనుషులను రక్షించవచ్చునన్న మా అంచనాలను అధిగమించామని ప్రొఫెసర్ లీక్ చెప్పారు. ఈ డ్రగ్ ధమనుల్లో ఫలకాలు ఏర్పడి రక్తం నిలిచిపోకుండా, గడ్డకట్టకుండా నివారిస్తుందని గుర్తించినట్లు ఆయన తెలిపారు. సిస్టమిన్ డ్రగ్ అథెరోస్క్లెరోసిస్ వ్యాధి చికిత్సలో కొత్త రకం అని, దీనిపై మరింత విస్తృత పరిశోధనలు జరిపి రోగులకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తామని ప్రొఫెసర్ లీక్ వెల్లడించారు. రానున్న కొన్నేండ్లలో క్రినికల్ ట్రయల్స్ పూర్తిచేస్తామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
సౌరశక్తి పలకలు, ఇతర ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించాలి: వెంకయ్యనాయుడు
గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణం
ఆర్థిక రాజధాని టు దేశ రాజధాని.. లక్ష కోట్లతో ఎక్స్ప్రెస్వే
పాకిస్తాన్కు తాలిబాన్ షాక్.. మా ఆసక్తులు మాకుంటాయని వెల్లడి
9/11 వంటి పెద్ద దాడి జరుగొచ్చు : అమెరికాకు చైనా హెచ్చరిక
హైదరాబాద్ను వదులుకుంటే కశ్మీర్ ఇస్తామని ప్రతిపాదన.. ఎవరు చేశారంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..