అహ్మదాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్లోని రాజ్భవన్లో ఆయనతో గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోపాటు ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. గుజరాతీ భాషలో భూపేంద్ర పటేల్ ప్రమాణం చేశారు. భూపేంద్ర పటేల్ గుజరాత్ 17 వ ముఖ్యమంత్రి.
అనంతరం అమిత్ షా ను స్వాగతించేందుకు పటేల్ విమానాశ్రయానికి వెళ్లారు. అమిత్ షాకు దండం పెట్టి స్వాగతించగా.. ఆయన పటేల్ వీపుపై తట్టారు. అంతకుముందు తన ఇంట్లో ప్రార్థనలు చేశారు. అనంతరం తాల్తేజ్లోని సాయిబాబా దేవాలయం, అదలాజ్లోని దాదా భగవన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అక్కడి నుంచి నేరుగా నితిన్ పటేల్ ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదాలు అందుకున్నారు. జామ్నగర్లో వరద బాదితులకు సహాయం చేస్తానని తొలి ట్వీట్ చేశారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయ్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
ఆర్థిక రాజధాని టు దేశ రాజధాని.. లక్ష కోట్లతో ఎక్స్ప్రెస్వే
పాకిస్తాన్కు తాలిబాన్ షాక్.. మా ఆసక్తులు మాకుంటాయని వెల్లడి
9/11 వంటి పెద్ద దాడి జరుగొచ్చు : అమెరికాకు చైనా హెచ్చరిక
హైదరాబాద్ను వదులుకుంటే కశ్మీర్ ఇస్తామని ప్రతిపాదన.. ఎవరు చేశారంటే..?
టీవీ యాంకర్గా నటుడు సోనూ సూద్.. ఏ ఛానల్లో.. ఏ ప్రోగ్రాంలో..?
1500 మందితో పాట షూటింగ్.. ఒక్కరికీ కరోనా రాలేదు! ఎందుకంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..