కోల్కతా : బీజేపీ ఎంపీ అర్జున్సింగ్ (Arjun Singh) నివాసం వద్ద మరో బాంబు పేలింది. ఆయన ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉదయం 9 గంటలకు పేలుడు జరిగింది. ఇప్పటికే ఆయన ఇంటి వద్ద వారం క్రితం మూడు క్రూడ్ బాంబులు పేలాయి. దీనిపై ఎన్ఐఏ విచారణ చేపట్టిన 24 గంటల వ్యవధిలోనే మరో బాంబు పేలింది.
పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లా పరిధిలోని జగదల్లోని బారాక్పూర్ ఎంపీ అర్జున్సింగ్ నివాసం ఉంటున్నారు. ఈనెల 8 వ తేదీన ఇంటికి సమీపంలోని మైదానంలో మూడు క్రూడ్ బాంబులు పేలాయి. దీనికి టీఎంసీయే బాధ్యత వహించాలని అర్జున్సింగ్ డిమాండ్ చేశారు. ఇలాఉండగా, ఇవాళ ఉదయం 9 గంటలకు మరో బాంబు పేలింది. ఇంటికి సమీపంలోని ఓపెన్ ప్లేస్లో క్రూడ్ బాంబ్ పేలింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. టీఎంసీ కార్యకర్తలే ఈ బాంబులను పేలుస్తున్నారని, దీనికి టీఎంసీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అర్జున్సింగ్ అన్నారు. టీఎంసీ మద్దతు కారణంగానే నేరగాళ్లు దర్జాగా తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి దాడులకు భయపడనన్నారు. భబానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పరిశీలకుడిగా తనను బీజేపీ నియమించడం వల్ల తనను భయబ్రాంతులకు గురిచేసేందుకే ఇలా బాంబులు పేలుస్తున్నారని అర్జున్సింగ్ పేర్కొన్నారు.
కాగా, బాంబులు వేయలేదని, వాటిని అక్కడి మైదానంలో దాచినట్లు స్థానిక పోలీసులు భావిస్తున్నారు. బాంబు పేలుడుపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మొదటి బాంబు పేలుడు ఘటనపై ఎన్ఐఏ విచారణ ప్రారంభించిన 24 గంటల్లోనే మరో బాంబు పేలడం కాకతాళీయం.
నీరజ్ జావెలిన్ కోచ్ ఉవే హూన్ తొలగింపు
బీఏలో ఆప్షనల్ సబ్జెక్ట్గా ‘రామ్చరిత్మానస్’.. ఎక్కడంటే?
‘నీట్’గా రూ.35 లక్షలకు పేపర్ అమ్మాడు.. ఎక్కడంటే..?
నీలి రంగు జెర్సీలోకి మారిన ఆర్సీబీ.. ఎందుకంటే?
అధికార భాషగా హిందీకి 72 ఏండ్లు
బర్రెపై ఎక్కి వచ్చి నామినేషన్ దాఖలు.. ఎక్కడంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..