దేవరకద్ర రూరల్, జూన్ 13 : విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత శి ఖరాలను అధిరోహించాలని సామాజికవేత్త దండు వెంకటేశ్ అన్నారు. చిన్నచింతకుంట మండలం పర్దీపూర్ గ్రామానికి చెందిన బాలరాజు కూతురు రేవ తి పదో తరగతిలో ఉత్తమ ఫలితం సాధించింది. అయితే ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థిని పై చదువులకు వెళ్ల లేక బాధపడుతుంది. విషయం తెలుసుకున్న వెంకటేశ్ విద్యార్థినికి తక్షణ సాయంగా రూ.5వేలు అందజేశారు. అదేవిధంగా దమగ్నాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్రామ్, సావిత్రీబాయిఫూలే చిత్రపటాలను అందించారు. కార్యక్రమంలో మధుసూదన్రెడ్డి, వెంకటన్న, బాబు, మహేందర్, శ్రావణ్కుమార్, శేఖర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.