Bus caught fire | కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 19 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటన మరవకముందే దేశంలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. రాజస్థాన్ (Rajasthan)లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది (Bus caught fire). ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
జైపూర్-ఢిల్లీ జాతీయ రహదారిపై మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు ఉత్తరప్రదేశ్ నుంచి తోడిలోని ఇటుక బట్టీకి కార్మికులను తీసుకెళ్తోంది. జైపూర్ గ్రామీణ జిల్లా షాపురా సబ్ డివిజన్లోని మనోహర్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతం వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. బస్సు రన్నింగ్లో ఉండగా.. హైటెన్షన్ విద్యుత్ వైర్లు (high tension line) తగిలాయి.
వెంటనే భారీ శబ్దం వచ్చి.. మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. సుమారు 12 మంది గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో బస్సు మొత్తం దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
#WATCH | Jaipur, Rajasthan: A bus full of labourers caught fire after it touched a high-tension wire in Todi village, Manoharpur police station area. The injured were taken to Shahpura Sub-District Hospital. More details awaited.
(Visuals from the hospital) pic.twitter.com/sw4ko5q4RK
— ANI (@ANI) October 28, 2025
Also Read..
Cloud seeding | నేడు ఢిల్లీలో కృత్రిమ వర్షం
Cyclone Montha | మొంథా ఎఫెక్ట్.. అల్లకల్లోలంగా సముద్రం.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాలు
BJP MLA | యమునా శుభ్రతపై రీల్స్.. అదుపుతప్పి నదిలో పడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే.. VIDEO