టాలీవుడ్ యాక్టర్ బెల్లంకొండ శ్రీనివాస్ తన అభిమానికి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని అందించాడు. కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి బెల్లంకొండ శ్రీనివాస్ కు అభిమాని. సదరు వ్యక్తి ఇల్లు కట్టుకుని..ఓపెనింగ్ కు బెల్లంకొండ శ్రీనివాస్ ను ఆహ్వానించాడు. సాధారణంగా హీరోలు తమ బిజీ షెడ్యూల్ వల్ల ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లరు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం తన అభిమాని ఆహ్వానం మేరకు లాక్ డౌన్ టైంలో హైదరాబాద్ నుంచి కర్నూలుకు ప్రయాణం చేశాడు.
శ్రీనివాస్ ఒక్కడే కాకుండా తండ్రి బెల్లంకొండ సురేశ్, తల్లి పద్మ, సోదరుడు గణేశ్ ను కూడా ఆ ఫంక్షన్ కు తీసుకెళ్లి అభిమానిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మొత్తానికి అభిమాని ఆహ్వానాన్ని మన్నించి..అతనికి మరిచిపోలేని క్షణాలను అందించింది బెల్లంకొండ సురేశ్ కుటుంబం.
ఇవి కూడా చదవండి..
రాజా విక్రమార్క టైటిల్తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
Recommended Content by ntnews.com