లక్నో : (UP BJP) త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. కొత్త పొత్తులు కలుస్తున్నాయి. కొత్త మిత్రులతో పంపకాల చర్చలు మొదలు పెట్టారు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రెండు పార్టీలతో పొట్టుపెట్టుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది. గతంలో మాదిరిగానే నిషాద్ పార్టీ, అప్నాదళ్తో ఎన్నికల పొత్తు పెట్టుకుంటున్నట్లు ఆ పార్టీ ఇంఛార్జీ ధరేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ విషయాన్ని కేంద్ర నాయకత్వం అధికారికంగా ప్రకటించనున్నదని ఆయన తెలిపారు.
శుక్రవారం నిషాద్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ కుమార్ నిషాద్తో సమావేశమైన బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వం.. సీట్ల భాగస్వామ్యానికి సంబంధించి చర్చించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఆ రెండు పార్టీలు నిర్ణయానికి వచ్చాయి. దీనికి సంబంధించిన వివరాలను ధర్మేంద్ర ప్రధాన్ మీడియాకు వెల్లడించారు. పలు పార్టీలు తమతో కలిసి పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని, అయితే, నిషాద్ పార్టీ, అప్నాదళ్తో తమ బంధం కొనసాగుతుందని చెప్పారు. నిషాద్ పార్టీతో అవగాహన కారణంగా ఉత్తరప్రదేశ్లో నిషాద్ కమ్యూనిటీ ఓటర్లు బీజేపీకి మద్దతు ఇస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. నిషాద్ పార్టీ 10 కంటే ఎక్కువ సీట్లను ఆశిస్తున్నట్లు తెలుస్తున్నది. తాము గౌరవప్రదమైన సీట్లను ఆశిస్తున్నామని, అయితే, 14 వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు తీసుకొస్తామని కేంద్రం, రాష్ట్రప్రభుత్వం హామీ ఇవ్వడమే తమకు ముఖ్యమని నిషాద్ పార్టీ అధినేత డాక్టర్ సంజయ్ కుమార్ నిషాద్ అన్నారు.
ఇలాఉండగా, గురువారం రాత్రి ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో బీజేపీ కోర్ కమిటీ సమవేశం జరిగింది. యోగి ఆదిత్యనాథ్తోపాటు రాష్ట్ర ఇంఛార్జీ రాధా మోహన్సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్, రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జీ ధర్మేంద్ర ప్రధాన్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, డాక్టర్ దినేశ్ శర్మ, రాష్ట్ర ప్రధానకార్యదర్శి సునీల్ బన్సల్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రానున్న అసెంబ్లీ ఎన్నిలక ప్రచారం, కార్యక్రమాలతో పాటు నిషాద్ పార్టీతో ఎన్నికల అవగాహనపై చర్చించినట్లు తెలుస్తున్నది.
జో బైడెన్కు రాకేశ్ తికాయత్ ట్వీట్.. ఏం చెప్పాడంటే?
ప్రపంచంలో ఇదే అతి తెల్లని పెయింట్..!
బాధితురాలి బట్టలు ఉతకమని నిందితుడికి శిక్ష
కొవిడ్ మృతుల జ్ఞాపకార్ధం 6 లక్షల తెల్ల జెండాలు
గాంధీ-అంబేడ్కర్ మధ్య పుణె ఒప్పందం.. దళితులకు 2 ఓట్లు రద్దు
విషపూరిత నీరు తాగినా.. ఈ బ్యాక్టీరియా మనల్ని కాపాడుతుంది!
ఇయర్ బడ్స్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..