నిజామాబాద్: హర్యానాలో జునైద్, నాసిర్లను చంపినవాళ్లను బీజేపీ ఎన్కౌంటర్ చేస్తుందా అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(MP Asaduddin Owaisi) ప్రశ్నించారు. ఇవాళ నిజామాబాద్లో మాట్లాడుతూ.. యూపీలో జరిగిన ఎన్కౌంటర్ను ఆయన ప్రస్తావించారు. మతం పేరిట బీజేపీ సర్కార్ ఎన్కౌంటర్లు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. చట్టాలను ఆ పార్టీ బలహీనపరుస్తుందన్నారు. రాజ్యాంగాన్ని ఎన్కౌంటర్ చేస్తోందని ఆరోపించారు. ఎన్కౌంటర్ చేసుకుంటూ పోతే అప్పుడు కోర్టులు, చట్టాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
#WATCH | Will the BJP also shoot those who killed Junaid and Nasir? No, because you (BJP) do encounters in the name of religion. You want to weaken the rule of law, do encounter of the Constitution: AIMIM MP Asaduddin Owaisi in Telangana's Nizamabad pic.twitter.com/H0a1xqRIC3
— ANI (@ANI) April 13, 2023
ఇవాళ గ్యాంగ్స్టర్ అతిక్ కుమారుడు అసద్ అహ్మద్ను యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఉమేశ్ పాల్ హత్య కేసులో అసద్ కోసం పోలీసులు గాలించారు. అయితే ఝాన్సీ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో అసద్ హతమయ్యాడు.