బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ జైలులోని ఖైదీలు మొబైల్ ఫోన్లు, టీవీ వాడుతున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Bengaluru Jail Inmates Use Mobiles, TV) ఈ నేపథ్యంలో ముగ్గురు జైలు సిబ్బందిని సస్పెండ్ చేశారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు ఖైదీలు విలాసవంతమైన జీవితం గడుతున్నారు. ఖైదీలు మొబైల్ ఫోన్లు వాడటంతో పాటు టీవీ చూస్తున్నారు. నెట్ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లను కూడా యాక్సెస్ చేస్తున్నారు. ఐపీల్ క్రికెట్ మ్యాచ్లపై కూడా చర్చించుకున్నారు.
కాగా, ఒక హత్య కేసులో రెండున్నర సంవత్సరాలకుపైగా జైలులో ఉన్న ఖైదీలు మార్చి 27న ఈ వీడియోను రికార్డ్ చేశారు. తమకు తెలిసిన బయట వ్యక్తులకు దీనిని షేర్ చేశారు. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. ఖైదీల గదుల్లో తనిఖీలు చేశారు. టాయిలెట్ బ్లాక్ సమీపంలోని భూగర్భ పైప్లైన్ ప్రాంతంలో మొబైల్ ఫోన్స్ దాచిపెట్టినట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై ముగ్గురు జైలు వార్డెన్లను సస్పెండ్ చేశారు.
కాగా, పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీల అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి గత కొన్ని నెలలుగా కఠిన చర్యలు అమలు చేస్తున్నామని జైలు అధికారులు తెలిపారు. అయితే తమ ప్రయత్నాలను దెబ్బతీయడానికే ఈ వీడియో వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. జైళ్ల డీజీపీ అలోక్ కుమార్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఏదైనా అంతర్గత కుట్ర జరుగుతున్నదా అన్నది కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Parappana Agrahara twist 🚨
Viral jail “luxury” video now exposed as staged conspiracy to target DGP Prisons Alok Kumar after crackdown.
3 wardens suspended for negligence as probe tightens.pic.twitter.com/LZzpPldYRW
— Gk (@Ggk_here_) March 29, 2026
Also Read:
Army rejects milk powder | నాణ్యతా లోపం.. 125 మెట్రిక్ టన్నుల పాల పొడిని తిరస్కరించిన ఆర్మీ
Girl Body in Flour Drum | పిండి డబ్బాలో బాలిక మృతదేహం.. ఎన్కౌంటర్లో నిందితుడు హతం
Watch: జీతం చెల్లించలేదని.. యజమాని కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన డంపర్ డ్రైవర్