Ram Mandir | దేశంలో ఏ ప్రతిష్టాత్మక కార్యక్రమం జరిగినా ముందుండే అంబానీ కుటుంబం (Ambani family).. అయోధ్య రామ మందిరం (Ram Mandir) కోసం కూడా తన వంతు సాయం చేసింది. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముడు కొలువైన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ముకేశ్ అంబానీ తన కుటుంబంతో కలిసి హాజరై బాలరాముడిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా రామాలయానికి అంబానీ కుటుంబం భారీ విరాళం ప్రకటించింది. రామభూమి ఆలయ ట్రస్ట్ను కలిసిన ముకేశ్ అంబానీ.. రూ.2.51 కోట్ల చెక్కును విరాళంగా అందజేసినట్లు సమాచారం. నగదుతోపాటు రామ్లల్లాకు 33 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు రిపోర్ట్స్ తెలిపాయి.
Also Read..
India Vs England: ఇంగ్లండ్తో టెస్టులకు… కోహ్లీ స్థానంలో కొత్త ప్లేయర్ ఎవరంటే?
Rohan Bopanna: చరిత్ర సృష్టించిన రోహన్ బొప్పన్న.. 43 ఏళ్ల వయసులో వరల్డ్ నెంబర్ వన్