ముంబై: ఇంగ్లండ్తో జరిగే తొలి రెండు టెస్టు మ్యాచ్(India Vs England)లకు విరాట్ కోహ్లీ దూరంగా ఉండనున్న విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో కొత్త ప్లేయర్ను ప్రకటించినట్లు తెలుస్తోంది. కోహ్లీ స్థానంలో రజత పటిదార్ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్ 21వ తేదీన సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా రజత్ పటిదార్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో అతను 137.50 స్ట్రయిక్ రేట్తో 16 బంతుల్లో 22 రన్స్ స్కోర్ చేశాడు.
పటిదార్ ఇటీవల ఇండియా ఏ తరపున అహ్మాదాబాద్లో ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో ఆడాడు. ప్రస్తుతం అతను టాప్ ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్తో టెస్టులకు అతను కీలకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. 30 ఏళ్ల పటిదార్ టెస్టుల్లో ఇండియా తరపున ఇంకా అరంగేట్రం చేయలేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పటిదార్ 404 రన్స్ చేశాడు. 12 మ్యాచుల్లో అతను 40.4 యావరేజ్తో స్కోరింగ్ చేశాడు. స్ట్రయిక్ రేట్ 144.29గా ఉంది. వ్యక్తిగత కారణాల చేత ఇంగ్లండ్తో జరిగే తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే.