Bus Accident | జమ్మూ కశ్మీర్లో (Jammu And Kashmir) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దోడా (Doda) జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
బటోట్-కిష్త్వార్ (Kishtwar) జాతీయ రహదారిపై ట్రుంగల్-అస్సార్ సమీపంలో (Assar region) బుధవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు జమ్మూ డివిజన్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. బస్సు రోడ్డుపై నుంచి 300 అడుగుల లోతులో పడిపోయినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 55 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటి వరకూ 25 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఘటనలో తీవ్రంగా గాయపడినవారిని దోడా, కిష్త్వార్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు గాయపడిన వారిని తరలించేందుకు హెలికాప్టర్ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
#UPDATE | 25 bodies recovered so far, rescue operation going on: J&K Police https://t.co/QoVr82Dkyb
— ANI (@ANI) November 15, 2023
Also Read..
Heavy Rains | భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలం.. 9 జిల్లాలకు ఐఎండీ అలర్ట్
Ind Vs Nz | ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్కు బెదిరింపులు.. వాంఖడే స్టేడియం వద్ద హై అలర్ట్
Rashmika Mandanna | రష్మిక డీప్ఫేక్ వీడియో కేసు.. బీహార్ యువకుడిని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు