Manipur | ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమి ఎంపీలు బుధవారం రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ని కలిశారు. మణిపూర్ (Manipur) సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు మణిపూర్ పర్యటకు వెళ్లి వచ్చిన 21 మంది ఇండియా కూటమి సభ్యులు రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాన్ని (Memorandum) సమర్పించారు. మణిపూర్ ఘటనపై పార్లమెంట్ లో ప్రకటన చేయాలని ప్రధాని మోదీ (Pm Modi)ని అడగాలని ప్రతిపక్ష నేతలు రాష్ట్రపతిని కోరారు.
సమావేశం అనంతరం విపక్ష నేతలు మీడియాతో మాట్లాడారు. మణిపూర్ సమస్యను రాష్ట్రపతికి వివరించినట్లు చెప్పారు. మణిపూర్ లో మహిళలపై జరుగుతున్న దురాగతాలను ముర్ముకు వివరించినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి మోదీ మణిపూర్ లో పర్యటించి.. రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రం అందించినట్లు తెలిపారు.
Also Read..
Cheetah | మరో చీతా మృతి.. ఐదు నెలల్లో తొమ్మిదో మరణం
Manipur Violence | మణిపూర్ అల్లర్లు.. మూడు నెలల్లో 30 మంది అదృశ్యం..!
Shehbaz Sharif | అన్ని సమస్యల పరిష్కారానికి భారత్ తో చర్చకు సిద్ధం : పాక్ ప్రధాని