Shehbaz Sharif | అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి భారత్ (India)తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి (Pakistan PM) షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ప్రకటించారు. రెండు దేశాల మధ్య నెలకొన్ని సమస్యల పరిష్కారానికి చర్చలే కీలమని.. యుద్ధం పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. రెండు దేశాలు పేదరికం, నిరుద్యోగంపై పోరాడుతున్నాయని పేర్కొన్నారు. ఇస్లామాబాద్ లో పాకిస్థాన్ మినరల్స్ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
పొరుగు దేశం (భారత్)తో సహా అందరితో చర్చలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. తీవ్రమైన విషయాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని.. యుద్ధమనేది ఎప్పటికీ ఓ పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో భారత్ – పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధాల చరిత్ర గురించి ప్రధాని ప్రస్తావించారు. యుద్ధాల ఫలితంగా పేదరికం, నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం, ఆర్థిక వనరుల కొరత ఏర్పడుతుందన్నారు.
‘పాకిస్థాన్ ఓ అణ్వాయుధ దేశం. మా వద్ద ఉన్న అణ్వాయుధాలు కేవలం రక్షణ కోసమే. యుద్ధం కోసం కాదు. ఒక వేళ అణు యుద్ధమే జరిగితే.. ఏం జరిగిందో చెప్పడానికి ఆ తర్వాత ఎవరూ మిగిలి ఉండరు. అందువల్ల ఏ సమస్యకైనా యుద్ధం పరిష్కారం కాదు. అణు యుద్దం జరిగితే దాని విధ్వంసం ఏ విధంగా ఉంటుందో పాకిస్థాన్ కు తెలుసు. ఇదే విషయాన్ని భారత్ కూడా గ్రహించాలని’ అని పాక్ ప్రధాని షెహబాజ్ వ్యాఖ్యానించారు.
Also Read..
China Floods | చైనాలో వరద బీభత్సం.. 20 మంది మృతి
Hyderabad | హబ్సిగూడలో దట్టంగా వ్యాపిస్తున్న పొగలు.. భయాందోళనలో స్థానికులు
Jobs | ఈ-కామర్స్లో కొలువుల జాతర.. ఈ పండుగ సీజన్లో 7 లక్షల మందికి ఉద్యోగాలు!