China Floods | చైనా (China)ను భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆ దేశ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వరదలు (Floods) పోటెత్తుతున్నాయి. ఈ వరదల కారణంగా సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మరో 27 మంది గల్లంతైనట్లు తెలిపింది.
ముఖ్యంగా చైనా రాజధాని బీజింగ్ (Beijing)లో ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. ఈ వరదల కారణంగా ఒక్క బీజింగ్ నగరంలోనే 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇక హెబీ ప్రావిన్సు (Hebei province)లో మరో 9 మంది మరణించారు. ఈ వరదల్లో మొత్తం 27 మంది గల్లంతయ్యారు. ఈ జల విలయంతో బీజింగ్ లో అనేక ఇళ్లు నీట మునిగాయి. రహదారులు పూర్తిగా దెబ్బతిని రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలుచోట్ల వరద ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా అప్రమత్తమైన అధికారులు రైల్వే స్టేషన్లను మూసివేశారు. వేల సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ వరదలకు 5 లక్షల మంది ప్రజలు ప్రభావితులైనట్లు స్థాని మీడియా నివేదించింది.
కాగా, బీజింగ్ లో వర్షపాతం చాలా తక్కువగా నమోదువతుంటుందని.. అయితే, ప్రస్తుతం కురిసిన వర్షం ధాటికి గత 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు రికార్డు స్థాయిలో సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. 2012లో వచ్చిన టైఫూన్ వల్ల అప్పుడు బీజింగ్లో 77 మంది మరణించారు.
Also Read..
Tamannaah Bhatia | తన ఏజ్పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన తమన్నా
Hyderabad | హబ్సీగూడ అన్లిమిటెడ్ షోరూంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
Jobs | ఈ-కామర్స్లో కొలువుల జాతర.. ఈ పండుగ సీజన్లో 7 లక్షల మందికి ఉద్యోగాలు!