Asaduddin Owaisi | రూ.2వేల నోట్ల ఆర్బీఐ ఉపసంహరించిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఆర్బీఐ చర్యలపై ప్రతిపక్షాలు కేంద్రంపై మండిపడ్డాయి. మూర్ఖమైన రూ.500నోట్ల, రూ.1000నోట్ల రద్దు నిర్ణయాన్ని కల్పిపుచ్చుకునేందుకు రూ.2వేల నోట్లను ఉపసంహరిస్తుందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్బీఐ చర్యను ఎత్తిచూపుతూ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ శనివారం ప్రధాని మోదీకి ఐదు ప్రశ్నలు సంధించారు. మీరు ఎందుకు రూ.2వేల నోట్లను ప్రవేశపెట్టారు?.. త్వరలోనే రూ.500నోట్లను సైతం ఉప సంహరిస్తారని అనుకోవచ్చా?, 70కోట్ల మంది భారతీయులకు స్మార్ట్ఫోన్ లేదని, వారు డిజిటల్ చెల్లింపులు ఎలా చేస్తారు ? అని ప్రశ్నించారు.
డెమో 1.0 అండ్ 2.0 చేయడంలో బిల్ గేట్స్ పాత్ర ఏంటీ..? ఎన్పీసీఐ చైనా హ్యాకర్లచే హ్యాకింగ్కు గురైందా? అంటూ ప్రశ్నలు సంధించారు. ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 30 తర్వాత ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే రూ.2వేల పరిస్థితి ఏంటంన్నది ఆర్బీఐ వెల్లడించలేదు. అంతకు ముందు డిపాజిట్ గడువు ముగిసిన తర్వాత రద్దు చేసిన రూ.500, రూ.100నోట్లను తమ వద్ద ఉంచుకోవడం నేరమని ప్రభుత్వం పేర్కొంది. పాత రూ. 500, రూ. 1,000 నోట్లను రాత్రికి రాత్రే చెల్లుబాటు కాకుండా నిర్ణయం తీసుకోగా.. ప్రస్తుతం రూ.2వేల నోట్లను సెప్టెంబర్ 30 వరకు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ తెలిపింది.
Five questions to Top Economist PM Modi:@PMOIndia
1. Why did you introduce the 2000 note in the first place?
2. Can we expect 500 note to be withdrawn soon?
3. 70 crore Indians don’t have a smart phone, how do they do digital payment?
4. What is the role of Bill Gates… https://t.co/9ykXtW9I2P
— Asaduddin Owaisi (@asadowaisi) May 20, 2023