Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్డీయేకు భంగపాటు తప్పదని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. జూన్ 4న కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి అధికారం చేపడుతుందని, అందులో ఆప్ భాగస్వామ్య పార్టీగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
విపక్ష కూటమి అధికారంలోకి వస్తే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ సోమవారం దేశ రాజధానిలో ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఢిల్లీలో తాము పాఠశాలలు, ఆస్పత్రులను మెరుగుపరిచామని చెప్పారు.
శాంతి భద్రతలు మాత్రం దారుణంగా ఉన్నాయని, లెఫ్టినెంట్ జనరల్ కనుసన్నల్లో నడిచే ఢిల్లీ పోలీసులు తమ మాట వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జూన్ 4 తర్వాత ఢిల్లీ పోలీసులు ప్రజల మాటకు తలవంచక తప్పదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Read More :