Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని నెగ్గారు (wins trust vote). ఈ విశ్వాస తీర్మానం సందర్భంగా కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందని మరోసారి ఆరోపించారు. ఏడుగురు ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఆఫర్ చేసిందని విమర్శించారు.
కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీజేపీకి సవాల్ విసిరే పార్టీ ఆమ్ ఆద్మీపార్టీనే అని అన్నారు. అందుకే తమను చూసి కమలం పార్టీ ఆందోళన చెందుతోందని, తమ పార్టీని దెబ్బతీయాలని చూస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినా.. 2029లో మాత్రం ఆ పార్టీని తాము తప్పక ఓడిస్తామని ఈ సందర్భంగా కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read..
Viral Video | కదులుతున్న కారుపై స్టంట్స్.. ఆకతాయిలకు తగిన బహుమతి ఇచ్చిన పోలీసులు
Ajit Pawar | మహారాష్ట్రలో సుప్రియా సూలే వర్సెస్ సునేత్ర పవార్.. బారామతిలో రసవత్తర పోరు..!
Black Panther | ఇంటి ముంగిట చక్కర్లు కొట్టిన బ్లాక్ పాంథర్.. వీడియో