Arvind Kejriwal | ఢిల్లీలో అధికారుల పోస్టింగ్, బదిలీలకు సంబంధించి కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ( ordinance)కు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) విపక్షాల మద్దతు కూడబెడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కేజ్రీవాల్.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi )ని కలిసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
‘బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా పార్లమెంట్లో మద్దతు కోరేందుకు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీని కలవనున్నాం. ఈ మేరకు సమయం కోరాము’ అని కేజ్రీవాల్ శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు.
ఢిల్లీలో అధికారుల పోస్టింగ్లు, బదిలీల విషయంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కాదని లెఫ్ట్నెంట్ గవర్నర్ (ఎల్జీ)కు సర్వాధికారాలు కట్టబెడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై ఆప్ (AAP) సర్కార్ పోరుబాటకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే సహా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party ) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar)తో సమావేశమయ్యారు. ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. ఈ మేరకు వారు ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు.
Sought time this morning to meet Cong President Sh Kharge ji and Sh Rahul Gandhi ji to seek Cong support in Parl against undemocratic n unconstitutional ordinance passed by BJP govt and also to discuss general assault on federal structure and prevailing political situation
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 26, 2023
Also Read..
Meta Layoffs | మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. భారత్లోని టాప్ ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం
Alibaba | లేఆఫ్స్ వేళ అలీబాబా గుడ్ న్యూస్.. 15 వేల మంది ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు ప్రకటన
Woman | 17 ఏళ్ల క్రితం అపహరణకు గురైన యువతి.. నేడు ఢిల్లీలో ప్రత్యక్షం