Uttarakhand Tunnel Collapse | ఉత్తరకాశీ టన్నెల్ (Uttarakhand Tunnel Collapse)లో చిక్కుకున్న 41 మంది కార్మికుల కథ సుఖాంతమైంది. సుమారు 17 రోజుల తర్వాత మంగళవారం రాత్రి వారంతా సురక్షితంగా బయటకు వచ్చారు (41 Workers Rescued).‘ర్యాట్-హోల్ మైనింగ్’ నిపుణులు కూలిన సొరంగంలో మాన్యువల్గా తవ్వకాన్ని చేపట్టి.. అందులో చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. వారంతా బయటకు రావడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కార్మికులను కాపాడేందుకు తలపెట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన నిపుణులను పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు సురక్షితంగా బయటకు రావడంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) స్పందించారు.
‘ఇది కృతజ్ఞతలు తెలపాల్సిన సమయం. టన్నెల్లో చిక్కుకుపోయిన 41 మందిని ప్రాణాలతో కాపాడటానికి గత 17 రోజులుగా నిర్విరామంగా పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దేశంలో ఏ క్రీడా విజయం ఇవ్వలేని ఆనందాన్ని మీరు ఈరోజు అందించారు. ఆశలు సాకారం చేశారు. ఈ చర్యతో మీరు ఓ దేశం ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. ఒక్క ఆశపై అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. అందరం కలిసికట్టుగా శ్రమిస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదని.. ఎంతటి సంక్లిష్టమైన సొరంగమైనా మనల్ని బయటపడకుండా ఆపలేదని నిరూపించారు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
It’s time for gratitude. Thank you to EVERY single person who worked tirelessly over the past 17 days to save these 41 precious lives. More than any sporting victory could have, you have uplifted the spirits of a country & united us in our hope. You’ve reminded us that no tunnel… https://t.co/ZSTRZAAJOl
— anand mahindra (@anandmahindra) November 28, 2023
Also Read..
Gas Cylinder Explosion | సిలిండర్ పేలి 5 ఇళ్లు ధ్వంసం.. 11 మందిని రక్షించిన అధికారులు
Feroz Khan | ఓటరుకు రూ.లక్ష.. నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్పై కేసు నమోదు
Uttarakhand Tunnel: టన్నెల్ పైప్లైన్ నుంచి బయటకు వచ్చిన కార్మికులు.. వీడియో