Feroz Khan | తెలంగాణ శాసనసభ ఎన్నికలకు (Telangana Assembly Elections) రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గెలుపు కోసం పలు పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఓటర్లకు డబ్బు ఎరచూపి ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి (Congress Nampally MLA candidate) ఫిరోజ్ ఖాన్ (Feroz Khan)పై తాజాగా కేసు నమోదైంది. ఓటరుకు రూ.లక్ష ఆఫర్ చేశారన్న (offering an amount of Rs 1 lakh to a voter) ఆరోపణలపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 171 సి, 188, 123 ఆర్పీ యాక్ట్ కింద కేసులు బుక్ చేశారు.
Telangana | A case has been booked against Congress Nampally MLA candidate Feroz Khan for allegedly offering an amount of Rs 1 lakh to a voter. The case has been booked under sections 171C, 188 and 123 RP Act: Hyderabad Police
— ANI (@ANI) November 29, 2023
తెలంగాణ శాసనసభ ఎన్నికలు గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలింగ్ దృష్ట్యా హైదరాబాద్లోని విద్యా సంస్థలకు నేడు, రేపు సెలవు ప్రకటించారు. ఇక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు ఎన్నికల రోజున ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (Chief Electoral Officer) వికాస్ రాజ్ ఆదేశించారు.
మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. 2290 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19,375 ప్రాంతాల్లో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Also Read..
Deeksha Divas | కేసీఆర్ ఆమరణ దీక్ష నడిచింది ఇలా.. ఇదీ టైమ్లైన్!