న్యూఢిల్లీ: ‘ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్’కు (Air India Express) చెందిన పైలట్లు, సిబ్బంది సామూహికంగా సిక్ లీవ్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 80కుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఇబ్బందిపడిన జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, డీపీఏపీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎయిర్ ఇండియా’ను మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల ఆకస్మిక రద్దుతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గులాం నబీ ఆజాద్, ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్లాల్సి ఉండగా, ఆ విమానం కూడా రద్దు అయ్యింది. దీంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సుమారు నాలుగు గంటలు వేచి ఉన్న ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విమానాలు రద్దైన విషయాన్ని ప్రయాణికులకు ముందుగా సమాచారం ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు.
కాగా, ఎయిర్ ఇండియా సంస్కృతి చెడ్డదన్న గులాం నబీ ఆజాద్, ఆ సంస్థను మూసి వేయాలని అన్నారు. ‘నేను పౌర విమానయాన మంత్రిగా ఉన్నప్పుడు, ఎయిర్ ఇండియా పైలట్లు 40 రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. అప్పుడు మేం ప్రైవేట్ విమానయాన సంస్థలను తీసుకువచ్చాం. కానీ వారు (ఎయిర్ ఇండియా) గుణపాఠం నేర్చుకోలేదు’ అని వ్యాఖ్యానించారు. చివరకు తాను ఇండిగో ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్నట్లు మీడియాతో ఆయన అన్నారు.
#WATCH | Over 70 international & domestic flights of Air India Express cancelled after its senior crew member went on mass 'sick leave'.
DPAP chief Ghulam Nabi Azad, whose Delhi-Srinagar was also cancelled, says, "…I was supposed to leave in the morning. But I am now leaving… pic.twitter.com/SWC9JnIX1d
— ANI (@ANI) May 8, 2024