తిరువనంతపురం : కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో విమానం కుప్పకూలడానికి (Plane Crash) పైలట్ తప్పిదమే కారణమని తేల్చారు. గత ఏడాది జరిగిన ఈ ఘటనలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. 257 పేజీలతో ఉన్న ఈ పరిశోధక నివేదికను ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) సిద్ధం చేసింది. పైలట్ తప్పిదంతోపాటు క్రమబద్ధమైన వైఫల్యం అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేమని నివేదిక తెలిపింది.
గత ఏడాది ఆగస్ట్ 7 న కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ బోయింగ్ 737-800 కుప్పకూలింది. ఈ విమానం దుబాయ్ నుంచి వచ్చింది. ల్యాండ్ అవుతుండగా రన్వే నుంచి జారిపడి లోతైన వాగులో పడిపోయింది. విమానంలో 190 మంది ప్రయాణికులు ఉండగా.. వీరిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు.
ఏఏఐబీ నివేదిక ప్రకారం, ఎస్ఓపీని విస్మరించి పైలట్ విమానాన్ని నడిపించాడు. టచ్డౌన్ పాయింట్ తర్వాత విమానాన్ని ల్యాండ్ చేశాడు. సగం రన్వే దాటిన తర్వాత పైలట్ ల్యాండింగ్ చేశాడు. ఈ సమయంలో ఫ్లైట్ను కంట్రోల్ చేయలేకపోయాడు. దాంతో విమానం కుప్పకూలింది. టేబుల్ టాప్ ఎయిర్ఫోర్ట అయిన కోజికోడ్ విమానాశ్రయం.. కేరళలోని నాలుగు చిన్న విమానాశ్రయాల్లో ఒకటి. టేబుల్ టాప్ విమానాశ్రయాల్లో వాతావరణం అనుకూలించక ప్రమాదాలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని నిపుణుల చెప్తున్నారు.
పునరుత్పాదక విద్యుత్ వినియోగంపై దృష్టిపెట్టండి : వెంకయ్యనాయుడు
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో లెబనాన్
గణనాథుల కలెక్షన్స్తో గిన్నిస్ బుక్కులోకి డెంటిస్ట్
1500 మందితో పాట షూటింగ్.. ఒక్కరికీ కరోనా రాలేదు! ఎందుకంటే?
14 వేల మంది పఠాన్లును నిలువరించిన 21 మంది సిక్కు జవాన్లు
కేంద్ర మంత్రి భార్య, కుమారుడిపై లుకౌట్ నోటీస్
మెక్డోనాల్డ్స్లో త్వరలో కడక్ చాయ్, పసుపు పాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..