ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేంద్ర మంత్రి నారాయణ్ రాణే (Narayan Rane) ఇటీవలనే వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కాగా, ఆయన భార్య, కుమారుడు కూడా వార్తల్లోకెక్కారు. ముంవై పోలీసులు వీరిద్దిరిపై లుకౌట్ నోటీసు జారీ చేశారు. రుణం చెల్లించడంలో విఫలమైనందుకు రాణే భార్య నీలం రాణే, ఆయన కుమారుడు, ఎమ్మెల్యే నితేష్ రాణేపై పుణె పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. ముంబై ఎయిర్పోర్ట్ అధికారులకు ఈ నోటీసును ఈ నెల 3 న ఇచ్చారు.
పుణె పోలీసు డిప్యూటీ కమిషనర్ (క్రైమ్) శ్రీనివాస్ గాడ్గే ప్రకారం, రుణం చెల్లించకూడదనే ఉద్దేశంతో వీరిద్దరూ ఎప్పుడైనా దేశం విడిచి వెళ్లిపోవచ్చునని, అలాగే చట్టపరమైన చర్యలను నివారించడానికి ప్రయత్నించవచ్చును. ఆర్ట్ లైన్ ప్రాపర్టీస్ ప్రైవేట్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) నుంచి రాణే భార్య నీలం రూ. 25 కోట్ల రుణం తీసుకున్నారు. అలాగే, నారాయణ రాణే స్వగ్రామం కంకవలిలో నిర్మించిన నీలం హోటల్ కోసం డీహెచ్ఎఫ్ఎల్ నుంచి రాణే కుమారుడు నితేష్ రాణే రూ.34 కోట్ల రుణం తీసుకున్నాడు.
ఈ రెండు రుణాలు తిరిగి చెల్లించనందున ఎన్పీఏగా మారాయి. రుణాలు ఎన్పీఏ అయిన తర్వాత, సదరు ఆర్థిక సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. దాంతో కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ లుకౌట్ నోటీసును జారీ చేసింది. కాగా, ఈ లుకౌట్ నోటీసు పరిధి పరిమితం అని, ఈ కేసులో అరెస్ట్ ప్రశ్న తలెత్తదని రాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ చెప్పారు.
మెక్డోనాల్డ్స్లో త్వరలో కడక్ చాయ్, పసుపు పాలు
ఆ రెండు గ్రూపులను పెంచకండి: తాలిబాన్కు ఆరు దేశాల సూచన
నందిగ్రామ్లో మాదిరిగానే భబానీపూర్లో గెలుస్తాం: షానవాజ్ హుస్సేన్
ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక వేధింపుల ఫిర్యాదు
ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఈడీ మూడో సమన్లు జారీ
కర్నల్ లాఠీఛార్జీపై విచారణకు హర్యానా ప్రభుత్వం ఆదేశం
18 ఏండ్లలో తొలిసారి 1000 మి.మీ వర్షపాతం
తీవ్రవాదంపై యుద్ధానికి రూ.585 లక్షల కోట్లు ఖర్చు
ఉగ్రవాదుల అమానుష దాడికి 20 ఏండ్లు పూర్తి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..