న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు (Rains in Delhi) అతలాకుతలమైంది. భారీగా నిలిచిన వర్షపు నీటితో రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా విపరీతమైన వర్షాలకు జనజీవనం స్థంభించిపోయింది. విమానాశ్రయంలోకి వరదనీరు చేరడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనం ఇండ్లు వదిలి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. 18 ఏండ్లలో తొలిసారి రికార్డు స్థాయిలో దాదాపు 1005.3 మి.మీ వర్షాపాతం నమోదైంది. 2010 లో ఇక్కడ 1000 మి.మీ వర్షం కురిసినట్లు ఢిల్లీ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 1 న కూడా రికార్డు స్థాయిలో వర్షం నమోదైంది. ఇక్కడ ఆరెంజ్ హెచ్చరికను అధికారులు విడుదల చేశారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో శనివారం కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
ఢిల్లీలో జూన్ 13 నుంచి రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. 19 ఏండ్లకు రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. అయినప్పటికీ 16 రోజుల పాటు వర్షం కురిసింది. ఈ సీజన్లో సగటు వర్షపాతం రెండింతలుగా నమోదైంది. మొత్తం వర్షాకాలంలో సగటున 649.8 మి.మీ వర్షం పడుతుంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు సగటు వర్షపాతం 586.4 మి.మీగా ఉండగా.. ఈసారి 10 సెప్టెంబర్ న 1005.3 మి.మీ వర్షం నమోదైంది. గతంలో 2003 లో ఇక్కడ 1005 మి.మీ వర్షం కురిసింది. ఆగస్టులో 10 రోజులు మాత్రమే వర్షం పడింది. ఇది ఏడు సంవత్సరాలలో అత్యల్పం. ఇదే సమయంలో సెప్టెంబర్లో ఇప్పటివరకు 248.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఢిల్లీలో సాధారణంగా సెప్టెంబర్ నెలలో 129.8 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది.
తీవ్రవాదంపై యుద్ధానికి రూ.585 లక్షల కోట్లు ఖర్చు
ఉగ్రవాదుల అమానుష దాడికి 20 ఏండ్లు పూర్తి
బెంగళూరులో ‘అప్పికో ఉద్యమం’.. ఎందుకంటే?
జపాన్ యువతలో బుస కొడుతున్న హికికొమోరి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..