బెంగళూరు : కరోనా సమయంలో ఆక్సిజన్ ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరికీ తెలిసి వచ్చింది. అయితే, చెట్లను పెంచడం సంగతి అటుంచితే.. చెట్లను నరకడం మాత్రం ఆపడం లేదు. తెలంగాణలో చెట్లను నరికిన వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు అక్కడ లేకపోవడంతో చెట్లను నరకొద్దంటూ పాఠశాల చిన్నారులు ‘అప్పికో ఉద్యమం’ (Appico Movement) చేపట్టారు.
బెంగళూరు ఉత్తరాన ఉన్న దాసరహల్లి ప్రాంతంలో ఉన్న జిందాల్ జూబ్లీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎన్నో వృక్షాలు ఉన్నాయి. ఏపుగా పెరిగిన దాదాపు 40 వృక్షాలను నరికేందుకు బృహన్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) నిర్ణయించింది. రోడ్డు వెడల్పులో భాగంగా పాఠశాల ఆవరణ స్థలాన్ని సేకరించిన అధికారులు.. అక్కడి వృక్షాలను తొలగించేందుకు నోటీస్ ఇచ్చారు. దాంతో ఈ స్కూల్లో చదువుతున్న, చదివిన విద్యార్థులంతా ఒక్కటయ్యారు. చల్లటి నీడనిస్తూ తమకు ఆడుకోవడానికి తోడుగా ఉంటున్న చెట్లను నరికేందుకు ఒప్పుకోమంటూ భీష్మించుకు కూర్చున్నారు. గతంలో జరిపిన చిప్కో మూవ్మెంట్ను జ్ఞప్తికి తెచ్చేలా ‘అప్పికో మూవ్మెంట్’ చేపట్టారు. చెట్టుకు ముగ్గురు, నలుగురు చొప్పున ఆలింగనం చేసుకుని కూర్చుని, చెట్లు నరకొద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఎప్పుడో 20 ఏండ్ల క్రితం నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఇక్కడి వారికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తున్నాయని, అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా చెట్లను నరికేందుకు చూస్తున్నారని ప్రీతి అనే విద్యార్థిని చెప్పింది. అధికారులకు కనువిప్పు కలిగించేందుకు అప్పికో ఉద్యమం చేపట్టామని తెలిపింది. ఇలాఉండగా, చెట్లను నరకవద్దని విద్యార్థుల నుంచి తమకు ఎలాంటి ఆర్జీ అందలేదని, అయినప్పటికీ పాఠశాలను సందర్శించి వృక్షాలను కాపాడేందుకు తగు చర్యలు తీసుకుంటామని బీబీఎంపీ జోన్ సంయుక్త కమిషనర్ నర్సింహమూర్తి చెప్పారు.
హజ్మత్ సూట్తో ఉత్తర కొరియా సైన్యం పరేడ్
10 ఏండ్లలో 25 మందితో పరారీ.. అయినా కోపం లేదంటున్న భర్త!
వారణాసి జ్ఞాన్వాపి మసీదు సర్వేపై స్టే
జమ్ముకశ్మీర్లో పర్యటిస్తున్న రాహుల్గాంధీ
ఆఫ్ఘన్ గడ్డ నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే సహించం : ఎస్ జైశంకర్
బాలీవుడ్ నటికి పాకిస్తాన్ కోర్ట్ అరెస్ట్ వారెంట్.. ఎందుకంటే?
జపాన్ యువతలో బుస కొడుతున్న హికికొమోరి
పుటుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..