ప్రయాగ్రాజ్ : వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు (Gyanvapi Mosque) సర్వే చేపట్టడంపై అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది. వారణాసి సివిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఉత్తర్వులు జారీ చేసింది. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞాన్వాపి మసీదును సమగ్ర భౌతిక సర్వే జరిపి నివేదిక అందించాలని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) కి వారణాసిలోని సివిల్ కోర్డు ఆదేశించింది. దీనిపై దాఖలైన పిటిషన్ను విచారించిన అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ మేరకు స్టే విధించింది.
వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు ఉన్న ప్రాంతంలోని పురాతన హిందూ దేవాలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి ట్రయల్ కోర్టు ముందు 1991 లో పిటిషన్ దాఖలైంది. 1664 లో మొఘల్ పాలకుడు ఔరంగజేబు కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ధ్వంసం చేసి, అదే ప్రాంతంలో మసీదును నిర్మించాడని స్వయంభు విశ్వేశ్వర్ ఆలయం తరఫున ప్రతినిధులు వాదనలు వినిపించారు.ఆరాధన స్థలం (ప్రత్యేక కేటాయింపులు) చట్టంలో పేర్కొన్న విషయాలను విస్మరిస్తున్నారని మసీదు కమిటీ వాదించింది.
హిందూ మందిరాన్ని పాక్షికంగా కూల్చివేసి మొఘల్ రాజులు ఈ మసీదును నిర్మించారని ఆరోపించే అభ్యర్ధనలపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని, అందుకు మసీదు ప్రాంగణాన్ని సర్వే జరుపాలని ఏఎస్ఐని ట్రయల్ కోర్టు ఆదేశించింది. దీనిపై మసీదు కమిటీతోపాటు వివిధ సంస్థలు, వ్యక్తులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. సింగిల్ బెంచ్ మార్చి 15 న వివిధ పిటిషన్లలో తీర్పును రిజర్వ్ చేసింది.
జమ్ముకశ్మీర్లో పర్యటిస్తున్న రాహుల్గాంధీ
ఆఫ్ఘన్ గడ్డ నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే సహించం : ఎస్ జైశంకర్
బాలీవుడ్ నటికి పాకిస్తాన్ కోర్ట్ అరెస్ట్ వారెంట్.. ఎందుకంటే?
జపాన్ యువతలో బుస కొడుతున్న హికికొమోరి
పుటుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..