టోక్యో : జపాన్ యువతలో హికికొమోరి (Hikikomori) సమస్య మళ్లీ కనిపిస్తున్నది. ఇది యువతతో ముడిపడి ఉన్న ఒక సామాజిక సమస్యగా పరిగణిస్తారు. ఈ సమస్యతో బాధపడుతున్నవారు సమాజానికి దూరంగా ఉండటమే కాకుండా కుటుంసభ్యులకు కూడా దూరంగా ఉంటుంటారు. ఇలా రోజులు, వారాలు, నెలలు కూడా ఒంటరిగా గడుపుతుంటారు. ఈసారి ఈ సమస్య హింసాత్మక స్వభావాన్ని సంతరించుకోవడం పట్ల వైద్య నిపుణులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 20 వ శతాబ్దం తొలినాళ్లలో కనిపించిన హికికొమోరి సమస్య.. ఇటీవల కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో చాలా పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు.
జపాన్లో హికికొమోరి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పదిన్నర లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. అయితే, అక్కడి మనస్తత్వవేత్తల ప్రకారం జపాన్ జనాభాలో దాదాపు 8 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. హికికొమోరి సమస్యతో బాధపడుతున్నవారు తీవ్ర నిరాశ నిస్పృహలో మునిగి ఉండి ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తుంటారు. వీరి వల్ల ఇతరులకు కూడా హాని ఉంటుంది. తమ ముందు ఉన్న వారు తమ కన్నా తక్కువ అని భావిస్తుంటారు. ముఖ్యంగా వీరి టార్గెట్గా మహిళలు ఉంటున్నారు. కరోనా సమయంలో జపాన్ సమాజంలో మహిళలపై పక్షపాతం గణనీయంగా పెరిగిపోయిందని హక్కుల ఉద్యమకారుడు కజునో హుటో చెప్పారు. ఈ సమస్యతో బాధపడుతున్న ఓ 36 ఏండ్ల వ్యక్తి ఇటీవల ఓ రైలులో కత్తితో పది మందిని గాయపరిచాడు. ఈ ఘటనలో 20 ఏండ్ల యువతిని మరీ దారుణంగా హింసించి తన మానసిక స్థాయిని బయటపెట్టుకున్నాడు. గత ఆరేండ్లుగా సంతోషంగా కనిపించే మహిళల్ని లక్ష్యంగా చేసుకుని చంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
పుటుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది..
జనవరి నుంచి కొత్తగా ఆన్లైన్ కార్డ్ చెల్లింపు వ్యవస్థ
యుద్ధానికి సన్నద్ధమవుతున్న చైనా.. 252 పేజీల అమెరికా డాక్యుమెంట్
జో బైడెన్కు తగ్గిన ప్రజాదరణ.. ఎందుకంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..