నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు (Kaloji Narayana Rao)1914 లో సరిగ్గా ఇదేరోజున కర్నాటక బీజాపూర్లోని రట్టిహళ్లిలో జన్మించారు. కాళోజీ అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ముద్దుగా ఈయనను కాళోజీ, కాళన్నా అని పిలుచుకునేవారు. తెలంగాణ ప్రాంతానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు.
కర్నాటక నుంచి వరంగల్కు తరలివచ్చిన కాళోజీ కుటుంబం వరంగల్లో స్థిరపడింది. ప్రాథమిక విద్య, ఉన్నత విద్యను వరంగల్లోని మడికొండలో, హైదరాబాద్లో పూర్తిచేశారు. 1939 లో హైదరాబాద్లో న్యాయ విద్యను అభ్యసించారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల పట్ల ఆకర్శితులై ఆర్య సమాజ్, పౌర హక్కుల సాధన వంటి పలు ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆంధ్ర మహా సభ ప్రారంభమైనప్పటి నుంచి దాని కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. అలాగే, సత్యాగ్రహం, గ్రంథాలయ ఉద్యమంతోపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపిన కాళోజీ.. పలు సార్లు జైలు జీవితం గడిపారు. పౌర హక్కుల సాధనలో క్రియాశీలకంగా ఉన్న ఆయన.. తుర్కుండె కమిటీలో సభ్యుడిగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు మూడు సార్లు పోటీ చేసిన కాళోజీ.. ఒకసారి విజయం సాధించారు. 1953 లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా.. అనంతర కాలంలో అధ్యక్షుడిగా ఎన్నికై సేవలందించారు.
కాళోజీ తెలుగు, ఉర్దూ హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో అనేక రచనలు చేసి ఖ్యాతి గడించారు. తన కవితల ద్వారా పేదలు, తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన రాసిన ‘నా గొడవ’ సంకలనంలో సమకాలీన సామాజిక సమస్యలను ఏకరువు పెట్టారు. ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి సభ్యుడిగా కూడా సేవలందించారు. కాళోజీ సేవలకు గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా.. భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. తెలంగాణ ప్రభుత్వం ఆయన సేవలకు గౌరవంగా వైద్యవిశ్వవిద్యాలయానికి కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్శిటీ అని పేరు పెట్టింది.
2015 : బ్రిటన్ మహారాణిగా ఎక్కువ కాలం కొనసాగి క్వీన్ ఎలిజబెత్ కొత్త రికార్డు నమోదు
2012: వరుసగా 21 పీఎస్ఎల్వీ ప్రయోగాలను పూర్తి చేసిన నాసా
2005: బీజింగ్లోని ఛోయాంగ్ పార్క్లో మహాత్మాగాంధీ విగ్రహం ఆవిష్కరణ
1999: యూఎస్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను గెలుచుకున్న భారతదేశానికి చెందిన మహేష్ భూపతి, జపాన్కు చెందిన ఆర్క్ సుగియమా జోడి
1991: సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తజికిస్తాన్
1976: చైనా మార్క్సిస్ట్ నాయకుడు మావో జెడాంగ్ దారుణహత్య
1967: బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందిన ఉగాండా
1965: చైనా స్వయం ప్రతిపత్త ప్రాంతంగా మారిన టిబెట్
1856 : అలీగఢ్ ముస్లిం యునివర్శిటీ ప్రారంభం
1828: ప్రముఖ రష్యన్ రచయిత లియో టాల్స్టాయ్ జననం
జనవరి నుంచి కొత్తగా ఆన్లైన్ కార్డ్ చెల్లింపు వ్యవస్థ
యుద్ధానికి సన్నద్ధమవుతున్న చైనా.. 252 పేజీల అమెరికా డాక్యుమెంట్
జో బైడెన్కు తగ్గిన ప్రజాదరణ.. ఎందుకంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..