బెంగళూరు : తమిళనాడు సీఎం విజయ్ చివరగా నటించిన మూవీ జననాయగన్ అనేక అడ్డంకులు దాటుకుని రిలీజ్ అయితే.. ఇప్పుడు మరో వివాదంలో పడింది. కర్ణాటకలో కావేరీ జలాల వివాదం ఇప్పుడు జననాయగన్ను తాకింది. తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడంపై కన్నడ సంఘాలు, ఇతర రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. విజయ్ జననాయగన్ పోస్టర్లను థియేటర్లలో చించేస్తున్నారు.
అనేక థియేటర్లలో సినిమా షోలను రద్దు చేస్తున్నారు. తమిళనాడుకు 15రోజుల పాటు రోజుకు 3500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ నిర్ణయించింది. దీంతో కన్నడ సంఘాలు నిరసనలు చేస్తున్నాయి.