గువాహటి : ముగ్గురు పిల్లలను కన్న ఓ వివాహిత.. పదేండ్ల కాలంలో 25 మందితో పారిపోయింది. తిరిగి ఇంటికి వచ్చిన ప్రతిసారీ ఇకపై అలా చేయనని హామీ ఇస్తూ.. మాట తప్పుతున్నది. అయినా, భర్తకు ఆమెపై ఎలాంటి కోపం లేదంటున్నాడు. ఇప్పుడు కూడా ఇంటికి రమ్మని కోరుతున్నాడు. ఐదు రోజుల క్రితం ఇంటినుంచి మరోసారి పరారైన ఈ వివాహితకు 6, 3 ఏండ్లు, 3 నెలల చిన్నారి కూడా ఉన్నది.
అసోం నాగావ్ జిల్లాలోని మారుమూల గ్రామమైన ధింగ లహ్కర్కు చెందిన ఓ వ్యక్తికి వివాహమై 10 ఏండ్లయింది. ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తున్న ఈయన భార్య ఇప్పటికి 25 మంది వ్యక్తులతో ఇంటి నుంచి పారిపోయింది. తాజాగా శనివారం కూడా ఇంట్లో దాచిన రూ.22 వేలతోపాటు కొన్ని వస్తువులను తీసుకుని పారిపోయింది. గతంలో ఇలా పారిపోయి తిరిగి ఇంటికి వచ్చిన ప్రతిసారీ ఇకపై ఇలా చేయనని, బుద్దిగా ఉంటానంటూ మాట ఇస్తుంది. మరో కొత్త వ్యక్తి పరిచయం కాగానే ఆయనతో వెళ్లిపోతుంది. కొన్నిసార్లు తమ చుట్టాల ఇంటికి వెళ్లానని, మరికొన్ని సార్లు తెలిసిన వారికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో వెళ్లానంటూ బుకాయిస్తున్నది.
ఆమెపై తనకు ఏమాత్రం కోపం లేదని, తిరిగి ఇంటికి రమ్మని ఆమె భర్త కోరుకుంటున్నాడు. మూడు నెలల చిన్నారిని వదిలి ఇంటి నుంచి పారిపోయిందని శనివారం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తనకు తెలిసిందన్నాడు. మేకలకు ఆహారం తేవడానికి వెళ్తున్నట్లు పొరుగింటి వారికి చెప్పినట్లు తెలుస్తున్నది. పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమెను ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదని ఆమెపై తన ప్రేమను వ్యక్తం చేశాడాయన.
వారణాసి జ్ఞాన్వాపి మసీదు సర్వేపై స్టే
జమ్ముకశ్మీర్లో పర్యటిస్తున్న రాహుల్గాంధీ
ఆఫ్ఘన్ గడ్డ నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే సహించం : ఎస్ జైశంకర్
బాలీవుడ్ నటికి పాకిస్తాన్ కోర్ట్ అరెస్ట్ వారెంట్.. ఎందుకంటే?
జపాన్ యువతలో బుస కొడుతున్న హికికొమోరి
పుటుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..