న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భబానీపూర్లో గెలుపు తమదే అన్న ధీమాలో బీజేపీ నేతలు ఉన్నారు. ఇదే నమ్మకాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు షానవాజ్ హుస్సేన్ (Shahnawaz Hussain) వ్యక్తం చేశారు. నందిగ్రామ్లో ఎలాగైతే విజయం సాధించామో.. అదే మాదిరిగా భబానీపూర్లో కూడా గెలిచి చూపిస్తామంటున్నారు షానవాజ్ హుస్సేన్. అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో గెలిచి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అవుతున్న విషయం తెలిసినా అక్కడి ప్రజలు దారుణంగా ఓడించారన్నారు.
త్వరలో జరుగనున్న భబానీపూర్ బైపోల్స్కు బీజేపీ ఇంఛార్జీగా నియమితులైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నందిగ్రామ్లో మాదిరిగా మరోసారి మమతను ఓడించేందుకు బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. రాహుల్గాంధీ జమ్ముకశ్మీర్ పర్యటనపై వ్యాఖ్యానిస్తూ.. ముందు ఆయన అక్కడ ఎలా శాంతి, సామరస్యతను తీసుకొచ్చామో చూడాలని సూచించారు. యూపీఏ సమయంలో ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో సైతం పర్యటిస్తే అసలు విషయాలు తెలిసేవని చెప్పారు.
భబానీపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ తమ అభ్యర్థిగా సీనియర్ న్యాయవాది ప్రియాంక టిబ్రేవాల్ను నిలిపింది. నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమిపాలైంది. భబానీపూర్ నుంచి గెలుపొంది మంత్రివర్గంలో చేరిన శోభన్దేవ్ ఛటోపాధ్యాయ ఎమ్మెల్యే పదవికి మే నెలలో రాజీనామా చేయడంతో.. ఇక్కడి నుంచి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు.
ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక వేధింపుల ఫిర్యాదు
ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఈడీ మూడో సమన్లు జారీ
కర్నల్ లాఠీఛార్జీపై విచారణకు హర్యానా ప్రభుత్వం ఆదేశం
18 ఏండ్లలో తొలిసారి 1000 మి.మీ వర్షపాతం
తీవ్రవాదంపై యుద్ధానికి రూ.585 లక్షల కోట్లు ఖర్చు
ఉగ్రవాదుల అమానుష దాడికి 20 ఏండ్లు పూర్తి
బెంగళూరులో ‘అప్పికో ఉద్యమం’.. ఎందుకంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..