ముంబై : చికెన్ ఉత్పత్తులతోపాటు ఇతర ఆహారాలను అందిస్తున్న ఇండియాలోని మెక్డొనాల్డ్స్ సంస్థ (McDonald’s) ఇప్పుడు రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పానీయాలను సరఫరా చేయడంపై దృష్టి సారించింది. దానా మెకాఫీ మెనూలో పసుపు కలిపి పాలు, మసాలా కడక్ చాయ్ అనే రెండు ఉత్పత్తులను జోడించింది. ఈ రెండు ఉత్పత్తులు మెకాఫీ అవుట్లెట్లలో త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
మెక్డొనాల్డ్స్ వెస్ట్ అండ్ సౌత్ ఫ్రాంచైజీ హర్డ్కాస్లీ రెస్టారెంట్లు, మెక్డీ మెక్అఫీ అవుట్లెట్లను నిర్వహిస్తున్నాయి. ఈ ఫ్రాంఛైజీ దేశంలోని 42 నగరాల్లో 305 మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్నది. ఈ రెస్టారెంట్లలో పసుపుతో కూడిన పాలు ప్రత్యేక ఉత్పత్తి కానున్నది. ఆయుర్వేద ఔషధాల తయారీలో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దగ్గు, జలుబు వంటి అనేక సమస్యలకు ప్రయోజనకరంగా పసుపు ఉంటుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో పసుపు చాలా ఉత్తమంగా పనిచేస్తుంది. ఈ ప్రత్యేక పాలలో యాలకులు, సాఫ్రన్ వంటి పోషకాలు కూడా కలుపనున్నారు.
అదేవిధంగా మసాలా కడక్ చాయ్ భారతీయ వినియోగదారులకు ప్రేమతోపాటు భావోద్వేగాన్ని అందించే పానీయంగా మెక్డొనాల్డ్స్ పరిచయం చేస్తున్నది. టర్మరిక్ పాల ధర రూ.140 గా.. మసాలా కడక్ చాయ్ ధర రూ.90 గా ఉండనున్నది. తొలుత 10 రెస్టారెంట్లలో ప్రారంభించి తర్వాత మిగతా 250 యూనిట్లలో ప్రారంభిస్తామని వెస్టర్న్, సదరన్ ఇండియా డైరెక్టర్ ఆర్వింద్ ఆర్పీ చెప్పారు.
ఆ రెండు గ్రూపులను పెంచకండి: తాలిబాన్కు ఆరు దేశాల సూచన
నందిగ్రామ్లో మాదిరిగానే భబానీపూర్లో గెలుస్తాం: షానవాజ్ హుస్సేన్
ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక వేధింపుల ఫిర్యాదు
ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఈడీ మూడో సమన్లు జారీ
కర్నల్ లాఠీఛార్జీపై విచారణకు హర్యానా ప్రభుత్వం ఆదేశం
18 ఏండ్లలో తొలిసారి 1000 మి.మీ వర్షపాతం
తీవ్రవాదంపై యుద్ధానికి రూ.585 లక్షల కోట్లు ఖర్చు
ఉగ్రవాదుల అమానుష దాడికి 20 ఏండ్లు పూర్తి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..