రోహతక్ : ఆయనో డెంటల్ డాక్టర్. ఆయన రూటే సెపరేటు. అందరిలా కాకుండా భిన్నంగా ఉండాలని కోరుకునే వ్యక్తి. అప్పుడెప్పుడో ముంబైకి వెళ్లిన సమయంలో గణనాథులను చూసి మోజు పడి విఘ్నేశ్వరుడి ప్రతిమలను సేకరించడం హాబీగా పెట్టుకున్నారు. అదే ఆయన పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేర్చేలా చేసింది.
హర్యానాలోని జింద్ ప్రాంతానికి చెందిన దంత వైద్యుడు డాక్టర్ వివేక్ సింగ్లా (Vivek Singla). 34 ఏండ్ల క్రితం ముంబైకి వెళ్లిన ఆయన.. అక్కడ రకరకాల భంగిమల్లో ప్రతిష్ఠించిన గణేషుడి విగ్రహాలను చూశాడు. అప్పటి నుంచి అలాంటి వాటిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పటివరకు 3106 వినాయక విగ్రహాలను సేకరించి చిన్న మ్యూజియంను తయారుచేశారు. ఈయన పేరు వరల్డ్ రికార్డ్స్లో చోటు చేసుకున్నది.
వీటిలో అష్టదాతు మొదలుకొని పాలరాయి, కలప, మట్టి, పీఓపీ వరకు అన్ని రకాల విగ్రహాలు ఉన్నాయి. కొన్ని విగ్రహాలు రెండు అంగుళాల నుంచి రెండు అడుగులు వరకు కూడా ఉన్నాయి. కొన్ని విగ్రహాలను థాయిలాండ్, ఇటలీ, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, వియత్నాం, ఫిలిఫ్పైన్స్ వంటి దేశాల నుంచి తీసుకొచ్చారు. ఈ విగ్రహాలను తన క్లినిక్లోని ప్రత్యేక గదుల్లో ఉంచాడు. తన వద్ద ఉన్న విగ్రహాల్లో థాయిలాండ్ నుంచి తెచ్చిన విగ్రహం 150 ఫీట్లతో అతిపెద్దదిగా ఉన్నది. తన చివరి శ్వాస వరకు ఇలాగే వినాయకుడి ప్రతిమలను సేకరిస్తానని డాక్టర్ వివేక్ సింగ్లా చెప్తున్నారు.
1500 మందితో పాట షూటింగ్.. ఒక్కరికీ కరోనా రాలేదు! ఎందుకంటే?
14 వేల మంది పఠాన్లును నిలువరించిన 21 మంది సిక్కు జవాన్లు
కేంద్ర మంత్రి భార్య, కుమారుడిపై లుకౌట్ నోటీస్
మెక్డోనాల్డ్స్లో త్వరలో కడక్ చాయ్, పసుపు పాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..