పుదుచ్చేరి : (Venkaiah Naidu) ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర పెద్ద సంస్థలు తమ విద్యుత్ అవసరాల కోసం సుస్థిరమైన పద్ధతులను అవలంబించాలని, ఇందుకు సౌరవిద్యుత్ వంటి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలను ఏర్పాటుచేసుకోవడంపై దృష్టిపెట్టాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. అన్ని రకాల పనికేంద్రాల భవనాల పైకప్పుల్లో సౌరవిద్యుత్ పలకలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా తమ తమ అవసరాలకు కావల్సిన పునరుత్పాదక విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవచ్చునన్నారు. రాష్ట్రాలు, స్థానిక సంస్థలు నూతన భవనాల నిర్మాణంలో పైకప్పుల్లో సౌర పలకలతో విద్యుదుత్పత్తి, నీటిని వేడిచేసుకునే వ్యవస్థ, ఇంకుడుగుంతల నిర్మాణం తప్పనిసరి చేస్తూ చట్టాలు, నిబంధనల్లో మార్పులు తేవాలని సూచించారు. పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్) లో నెలకొల్పిన 1.5 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని వెంకయ్యనాయుడు ఆదివారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో మానవాళి నేర్చుకున్న పాఠాలను గుర్తుచేస్తూ.. భవంతులు, ఇతర నివాస ప్రాంతాల్లో కావాల్సినంత వెలుతురు, స్వచ్ఛమైన గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలని చెప్పారు. గతానికి భిన్నంగా మన జీవన విధానాలను మార్చుకుంటూ అరోగ్య సమస్యల ఎదుర్కొంటున్నామని తెలిపారు. జిప్మర్ వంటి వైద్య సంస్థలు కరోనా మహమ్మారి సమయంలో చేసిన కృషిని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, శాసనసభ స్పీకర్ ఎంబలమ్ ఆర్ సెల్వమ్, జిప్మర్ సంచాలకుడు రాకేష్ అగర్వాల్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, జిప్మర్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో లెబనాన్
గణనాథుల కలెక్షన్స్తో గిన్నిస్ బుక్కులోకి డెంటిస్ట్
1500 మందితో పాట షూటింగ్.. ఒక్కరికీ కరోనా రాలేదు! ఎందుకంటే?
14 వేల మంది పఠాన్లును నిలువరించిన 21 మంది సిక్కు జవాన్లు
కేంద్ర మంత్రి భార్య, కుమారుడిపై లుకౌట్ నోటీస్
మెక్డోనాల్డ్స్లో త్వరలో కడక్ చాయ్, పసుపు పాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..