బీరుట్ : పశ్చిమ ఆసియా దేశమైన లెబనాన్లో (Lebanon) తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొన్నది. ఆహారం కంటే 8 రెట్లు ఖరీదైనదిగా నీరు మారింది. ఆహార పదార్థాల నుంచి డీజిల్, పెట్రోల్, గ్యాస్, రోజువారీ వస్తువుల కోసం ప్రజలు గంటల కొద్దీ క్యూలో నిలబడాల్సి వస్తున్నది. విద్యుత్ సరఫరాను లిమిట్ చేశారు. రోజులో ఒక గంట మాత్రమే విద్యుత్ సరఫరా ఉంటుంది. ఆఫీసు పనిలో మూడింట ఒక వంతు మాత్రమే జరుగుతున్నది. ఆరోగ్యసేవలు అస్తవ్యస్తంగా మారాయి. పాఠశాలలు మూతపడ్డాయి.
ఈ సమస్యల మధ్యే లెబనాన్లో కొత్త ప్రధానమంత్రిగా నజీబ్ మికటి రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టారు. నజీబ్ దేశంలో అత్యంత ధనవంతుడు. గతంలో కూడా ఈ పదవిలో కొనసాగారు. గత ఏడాది ఆగస్టు 4 న బీరుట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 200 మందికి పైగా పౌరులు మరణించారు. అనంతరకాలంలో దేశంలో రాజకీయ గొడవల కారణంగా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.
కొంతకాలంగా నిత్యవసరాల కరువు ఏర్పడటం మొదలైంది. దాంతో అన్ని వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. జనవరిలో 1000 లెబనీస్ పౌండ్లకు లభ్యమైన లీటర్ డీజిల్, పెట్రోల్ ఇప్పుడు లీటరుకు 6500 లెబనీస్ పౌండ్లుగా మారింది. ఏడాది క్రిత వరకు 1000 లెబనాన్ పౌండ్లకు (దాదాపు రూ.48) దొరికే బ్రెడ్.. ఇప్పుడు 6000 లెబనాన్ పౌండ్లను (దాదాపు రూ.288) కు దొరుకుతున్నది.
150 ఏండ్లలో లెబనాన్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్న స్థితిలో ఉన్నదని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. గత రెండు సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభం కారణంగా లెబనాన్లో పరిస్థితి మరింత దిగజారింది. దీనికి తోడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు భగ్గుమంటున్నాయి. అల్లర్లు కూడా జరుగుతున్నాయి. ఉత్తర నగరం ట్రిపోలీ, ఇతర ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దేశ జనాభాలో 78 శాతం మంది పేదరికాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభం గందరగోళ పరిస్థితికి దారితీయవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనుగడ కోసం ప్రజలు దేనికైనా తెగబడే అవకాశాలు ఉన్నాయని వారంటున్నారు.
గణనాథుల కలెక్షన్స్తో గిన్నిస్ బుక్కులోకి డెంటిస్ట్
1500 మందితో పాట షూటింగ్.. ఒక్కరికీ కరోనా రాలేదు! ఎందుకంటే?
14 వేల మంది పఠాన్లును నిలువరించిన 21 మంది సిక్కు జవాన్లు
కేంద్ర మంత్రి భార్య, కుమారుడిపై లుకౌట్ నోటీస్
మెక్డోనాల్డ్స్లో త్వరలో కడక్ చాయ్, పసుపు పాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..