Air India | టాటా సన్స్ గ్రూప్ ఆధీనంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) గత కొన్ని రోజులుగా తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. గతేడాది ఆరంభంలో మూత్ర విసర్జన ఘటనలతో తరచూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఫుడ్ విషయం, క్యాబిన్ సిబ్బంది, ప్రయాణికుల ప్రవర్తన ఇలా తరచూ ఏదో ఒక వివాదం ఎయిర్ ఇండియా సంస్థను వెంటాడుతూనే ఉంది. తాజాగా విమానంలో అందించే ఫుడ్ (Food) విషయమై మరోసారి వార్తల్లోకెక్కింది.
ఈనెల 8వ తేదీన కాలికట్ నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన వీరా జైన్ అనే మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది. విమానంలో శాఖాహార భోజనం ( veg meal ) ఆర్డర్ చేయగా.. అందులో చికెన్ ముక్కలు (chicken pieces) వచ్చాయి. క్రూ సిబ్బంది సర్వ్ చేసిన ఆహార ప్యాకెట్పై ‘వెజ్ మెయిన్ మీల్’ అని స్పష్టంగా రాసిఉన్నా.. అందులో చికెన్ పీసెస్ రావడం పట్ల ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆ ఫుడ్ను ఫొటోలు తీసి సామాజిక మాధ్యమం ఎక్స్లో షేర్ చేసింది. ఈ మేరకు తనకు ఎదురైన అనుభవాన్ని వివరించింది. చికెన్ పీసెస్ రావడంపై సిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆహారం విషయమే కాకుండా.. ఫ్లైట్ కూడా గంట ఆలస్యంమైందని అసంతృప్తి వ్యక్తం చేసింది. జైన్ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
On my @airindia flight AI582, I was served a veg meal with chicken pieces in it! I boarded the flight from Calicut airport. This was a flight that was supposed to take off at 18:40PM but left the airport at 19:40PM.
Details-
AI582
PNR- 6NZK9R
Seats- 10E, 10F#AirIndia pic.twitter.com/LlyK6ywleB— Veera Jain (@VeeraJain) January 9, 2024
Also Read..
Akshay Kumar | ముంబై మెట్రోలో ప్రయాణించిన అక్షయ్ కుమార్.. వీడియో
Bengaluru CEO | ఐలైనర్తో టిష్యూ పేపర్పై లేఖ.. బెంగళూరు సీఈవో ఏం రాసిందంటే..?
Cocaine | ముంబై ఎయిర్పోర్ట్లో రూ.40 కోట్లు విలువ చేసే కొకైన్ పట్టివేత