చెన్నై: ఒక టూరిస్ట్ వాహనం కొండ మలుపులో అదుపుతప్పింది. కిందకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఉపాధ్యాయులతో సహా 9 మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. దీంతో ఆ ప్రభుత్వ స్కూల్లో విషాదం నెలకొన్నది. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (Valparai Tragedy) కేరళలోని మలప్పురం జిల్లా పాంగ్-పల్లిపరంబ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, సిబ్బందితో కూడిన 13 మంది పర్యటన కోసం తమిళనాడు వెళ్లారు. శుక్రవారం ట్రావెల్ టెంపో వాహనంలో వాల్పరై హిల్ స్టేషన్ను సందర్శించారు.
కాగా, వాల్పరైలో పర్యటన ముగించుకుని కొండ నుంచి కిందకు దిగుతుండగా ఆ వాహనం ప్రమాదానికి గురైంది. 13వ హెయిర్పిన్ మలుపు వద్ద అది అదుపుతప్పి కిందకు దూసుకెళ్లింది. 9వ హెయిర్పిన్ మలుపులోని రోడ్డుపై బోల్తాపడింది. ఆ వాహనంలో ఉన్న 13 మందిలో ఒక బాలిక, ఏడుగురు మహిళలు, ఒక పురుషుడితో సహా 9 మంది ఈ ప్రమాదంలో మరణించారు. మృతుల్లో ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు.

Kerala Teachers Killed
మరోవైపు ట్రావెల్ వాహనం డ్రైవర్, మరో ముగ్గురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. వీరిలో ఇద్దరిని కోయంబత్తూరు వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ప్రధాని మోదీ, కేరళ సీఎం విజయన్ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. టీచర్లు, సిబ్బంది మరణించడంతో కేరళలోని పాంగ్-పల్లిపరంబ ప్రభుత్వ స్కూల్లో విషాదం నెలకొన్నది.
Also Read:
Car, Bus Catches Fire | ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కారు.. చెలరేగిన మంటలు, 9 మంది మృతి
Watch: థార్తో ఐదుగురిని ఢీకొట్టిన ఎమ్మెల్యే కొడుకు.. హారన్ మోగిస్తున్నా ఎందుకు తప్పుకోలేదంటూ వాదన