భోపాల్: బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు థార్ వాహనం నడిపిపాడు. బైక్తోపాటు, రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న మహిళలపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. (BJP MLA’s son Rams Thar) అయితే తాను హారన్ మోగించినప్పటికీ ఎందుకు తప్పుకోలేదంటూ వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
పిచోర్ ఎమ్మెల్యే ప్రీతమ్ లోధి కుమారుడైన దినేష్ లోధి గురువారం సాయంత్రం 7.30 గంటల సమయంలో థార్ వాహనం నడిపాడు. కరేరా ప్రాంతంలో బైక్పై వెళ్తున్న ముగ్గురితోపాటు నడుస్తున్న ఇద్దరు మహిళలపైకి థార్ను దూకించాడు. వెనుక నుంచి వారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరేరా పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు దినేష్ లోధి వింత వాదనకు దిగాడు. తాను హారన్ మోగిస్తున్నప్పటికీ రోడ్డు పక్కకు ఎందుకు తప్పుకోలేదని గాయపడిన వారిని ప్రశ్నించాడు. ఈ ప్రమాదానికి వారే కారణమన్నట్లు మాట్లాడాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు తన అధికార దర్పాన్ని ప్రదర్శించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
“When I was sounding the siren, why didn’t you move?” says BJP MLA son after ramming 5 with Thar
In a shocking display of entitlement and power in Madhya Pradesh’s Shivpuri, Dinesh Lodhi, son of Pichhore MLA Pritam Lodhi, allegedly rammed his Thar into five people on the road.… pic.twitter.com/9eOHl3JgKM
— Piyush Rai (@Benarasiyaa) April 17, 2026
Also Read:
Woman High Court jump threat | హైకోర్టు పైకి ఎక్కిన మహిళ.. బిడ్డతో సహా కిందకు దూకుతానని బెదిరింపు