Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్కు భక్తులు (Devotees) తరలివస్తున్నారు. దీంతో కుంభ్ప్రాంతమంతా యాత్రికులతో కిటకిటలాడుతోంది. నేడు లాస్ట్ డే కావడంతో గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో చివరి అమృతస్నాన్ (holy dip) కోసం పోటెత్తుతున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల వరకూ దాదాపు 90 లక్షల మంది భక్తులు నదీ స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.
#WATCH | #KumbhOfTogetherness | Prayagraj | Devotees continue to arrive at Triveni Sangam to be a part of #MahaKumbh2025 – as the world’s largest religious gathering that began on Paush Purnima – January 13, concludes today. pic.twitter.com/36gRMcwXPt
— ANI (@ANI) February 26, 2025
కాగా, పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13న మహాకుంభమేళా ప్రారంభమైన విషయం తెలిసిందే. నేడు శివరాత్రితో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ముగియనుంది. 45 రోజుల పాటూ సాగిన ఈ కుంభమేళాలో ఇప్పటి వరకూ 65 కోట్ల మందికిపైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది.
#WATCH | #KumbhOfTogetherness | Uttar Pradesh: Devotees continue to arrive in large numbers at Triveni Sangam in Prayagraj to be a part of Maha Kumbh on its last day. The Mela will conclude today, 26th February, on Maha Shivratri. pic.twitter.com/RZE37bQ1l8
— ANI (@ANI) February 26, 2025
మరోవైపు నేడు చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో యూపీ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ప్రయాగ్రాజ్ను నో వెహికిల్ జోన్గా ప్రకటించింది. కుభమేళాలో పుష్య పూర్ణిమ (జనవరి 13), మకర సంక్రాంతి (జనవరి 14), మౌని అమావాస్య (జనవరి 29), వసంత పంచమి (ఫిబ్రవరి 3), మాఘ పూర్ణిమ (ఫిబ్రవరి 12), మహాశివరాత్రి (ఫిబ్రవరి 26) ప్రత్యేక తేదీలుగా ప్రకటించారు. ఆయ రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. కాగా, మంగళవారం 1.33 కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇవాళ రెండు కోట్ల మంది వరకూ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉందని యోగి సర్కార్ అంచనా వేస్తోంది.
#WATCH | #KumbhOfTogetherness | Uttar Pradesh: Devotees continue to arrive in large numbers at Triveni Sangam in Prayagraj to be a part of Maha Kumbh on its last day. The Mela will conclude today, 26th February, on Maha Shivratri.
Drone visuals from the area. pic.twitter.com/DZfZBr9hCn
— ANI (@ANI) February 26, 2025
Also Read..
Naga Sadhus: కాశీలో నాగసాధువుల ఊరేగింపు.. డ్రోన్ వీడియోలు
Kasi Vishwanath | మహా శివరాత్రి వేళ కిక్కిరిసిన శైవ క్షేత్రాలు.. కాశీకి పోటెత్తిన భక్తులు.. Video
Mahua Maji | కుంభమేళా నుంచి తిరిగివస్తుండగా ప్రమాదం.. ఎంపీకి గాయాలు