Encounter | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో మరోసారి ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. గరియాబాద్ జిల్లా ఇందగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సొర్నామల్ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల (Maoists) మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోలు హతమయ్యారు.
అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో స్థానిక పోలీసులు, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ జవాన్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఒడిశాలోని నవరంగపూర్కు చెందిన సైనికులు కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ ఆపరేషన్లో ముగ్గురు నక్సలైట్లు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపారు.
Also Read..
PM Modi: కావాలంటే అద్దాలమేడ కట్టుకునేవాడిని.. ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు
Maha Kumbh Mela | మహాకుంభమేళా.. ప్రత్యేక వెబ్పేజీని ప్రారంభించిన ఐఎండీ
HMPV | చైనాలో మరో మహమ్మారి.. హెచ్ఎంపీవీ లక్షణాలు, నివారణ చర్యలు ఇవే..!