న్యూఢిల్లీ: ఫ్లైఓవర్పై ఒక కారు ఆగి ఉన్నది. అనుమానించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకుని ఆ కారును పరిశీలించారు. అందులో ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. (Three bodies inside car) దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం పీరగఢి ప్రాంతంలోని ఫ్లైఓవర్పై ఒక కారు చాలాసేపు పార్కింగ్ చేసి ఉన్నది. అనుమానించిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ కారును పరిశీలించారు. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు గ్రహించారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు.
మరోవైపు మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఇద్దరి వయస్సు 40 ఏళ్లు, మరొకరి వయస్సు 60 ఏళ్లు ఉండవచ్చని చెప్పారు. ఆ ముగ్గురు మద్యంలో విషం కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
Also Read:
BJP Leader Assaults Woman | మహిళను కర్రతో కొట్టి కాళ్లతో తన్నిన బీజేపీ నేత.. వీడియో వైరల్
girl raped and killed | ఆడుకుంటున్న బాలికను లాక్కెళ్లి.. అత్యాచారం చేసి హత్య
Watch: రోడ్డుపై జారిన బైక్.. చావు నుంచి తృటిలో తప్పించుకున్న విద్యార్థి
Watch: మేళాలో కూలిన స్వింగ్ రైడ్.. పోలీస్ అధికారి మృతి, 13 మందికి గాయాలు