జైపూర్: రాజస్థాన్లో దారుణం జరిగింది. అన్నం పెడుతామని పిలిచి ఓ వివాహిత మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని డూంగ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జైపూర్లో ఆస్పత్రికి వచ్చిన ఓ 22 ఏండ్ల మహిళకు అన్నం పెడుతామని ఆశచూపి ఆంబులెన్స్ డ్రైవర్, అతని సహాయకుడు ఆంబులెన్స్లోకి ఎక్కించుకున్నారు.
అనంతరం ఆంబులెన్స్ను నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులైన ఆంబులెన్స్ డ్రైవర్, అతడి సహాయకుడిని అరెస్టు చేశారు. వాళ్లపై ఐపీసీ సెక్షన్ 376డి (సామూహిక అత్యాచారం) ప్రకారం కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.