హైదరాబాద్, మే 4(నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఈనెల 13నుంచి జరగాల్సిన డిపార్టుమెంటల్ పరీక్షలను వాయిదా వేశామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. శనివారం అధికారికంగా ప్రకటించారు.
తిరిగి జూన్ 12నుంచి 20వరకు నిర్వహించనున్నట్టు సర్వీస్ కమిషన్ అధికారులు పేర్కొన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో నిర్వహించనున్న పరీక్షల పూర్తి టైంటేబుల్ను సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచామని తెలిపారు.