Kangana Ranaut | సిమ్లా, మే 4: సినీ నటి, మండీ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మాజీ ప్రధాని నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోతీలాల్ నెహ్రూ అప్పట్లో అంబానీలా అత్యంత ధనవంతుడని, బ్రిటీషర్లతో అత్యంత సన్నిహితంగా మెలిగే ఆయనకు అంత సంపద ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదని శనివారం ఎన్నికల ప్రచార సభలో ఆరోపించారు.
కంగన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ పార్టీ సీనియర్ నేతపై అవమానకర వ్యాఖ్యలు చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది. స్వాతంత్య్ర సమరయోధుడైన మోతీలాల్ నెహ్రూను వ్యాపార వేత్తతో పోల్చి ఆయనను అవమానపరిచారని పేర్కొంది.