ముంబై: మహారాష్ట్రలోనూ జికా వైరస్ కాలుమోపింది. ఆ రాష్ట్రంలోని పుణె పట్టణంలో ఓ మహిళలో జికా వైరస్ ( Zika virus ) బారిన పడినట్లు అధికారులు గుర్తించారు. మహిళకు జికా వైరస్ సోకినట్లు తేలగానే ఆరోగ్యశాఖ అప్రమత్తమైందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే చెప్పారు. ఫాగింగ్, క్లీనింగ్ లాంటి నియంత్రణ చర్యలు చేపట్టిందన్నారు. మరోవైపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదని ఆయన చెప్పారు.
కొల్హాపూర్, సాహ్ని, సతారా, పుణె జిల్లాల్లో కరోనా వైరస్ విస్తృతి ఎక్కువగా ఉన్నదని రాజేష్ తోపే తెలిపారు. రాష్ట్ర సగటుతో పోల్చుకుంటే ఈ నాలుగు జిల్లాల్లో పాజిటివిటీ రేటు చాలా ఎక్కువగా ఉన్నదన్నారు. అందుకే ఆ నాలుగు జిల్లాల్లో ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్ లాంటి కొవిడ్ ప్రొటోకాల్స్ను కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ మధ్య భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలు తమ పనులకు ఆటంకం కలిగించాయన్నారు.
ఇవి కూడా చదవండి
మనవడితో కలిసి బామ్మ నాగినీ డ్యాన్స్.. వైరల్ వీడియో
Video viral : ఓ యువజంట బరితెగింపు.. రన్నింగ్ బైక్పైనే రొమాన్స్..!