అమరావతి : ఏపీలో ఆర్థికశాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఇద్దరు సెక్షన్ అధికారులు, సహాయ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ అధికారులుగా డీ శ్రీనిబాబు, కే వరప్రసాద్, సహాయ కార్యదర్శి నాగులపాటి వెంకటేశ్వర్లు పని చేస్తున్నారు. ఆర్థికశాఖలోని సమాచారం లీక్ చేస్తున్నారన్న అభియోగంపై ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ముగ్గురు హెడ్క్వార్టర్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది.